కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల గురించి మాట్లాడిన మాటలతో మనస్తాపానికి గురయ్యిన 384 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మమ్మల్నీ చంద్రబాబు నాయుడు తన మాటలతో సొంత మీడియా అండతో అవహేళన చేస్తూ వస్తున్నారు. అసలు కుప్పంలో సొంత ఇళ్లు లేని చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు ప్రతి సెకను అందుబాటులో వుండే మమ్మలని అవమానపరుస్తున్నారు దానిని తట్టుకోలేక మేమంతా వాలంటీర్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాము. రేపటి నుండి ప్రజలకు మా మీద టీడీపీ నాయకులు చేస్తున్న దారుణాలు ప్రజలకు సహాయం చెయ్యకుండా అడ్డుకున్న ప్రతి విషయన్ని వివరిస్తాము అంటూ ప్రకటించారు.
గత వారం రోజులుగా ఎన్నికల వేళ ఏపీలో కొందరు వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ కు మద్దతుగా పెద్దఎత్తున వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే మచిలీపట్నం లో 1200 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు, అలాగే వివిధ జిల్లాలో మరో 2500 మంది రాజీనామా చేశారు ఇప్పుడు తాజాగా కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారని.. అప్పుడు తమను తిరిగి విధుల్లో చేర్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
ఇక జరుగుతున్న ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ అభ్యర్థి అయిన భరత్ ను భారీ మెజార్టీ తో గెలిపిస్తాము, ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ కు టీడీపీ చేసిన ఫిర్యాదులతో వాలంటీర్లను ఫించన్ ఇవ్వకూడదు అని అదేశాలు ఇచ్చారు. అలాగే ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందించకూడదు అని ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది. దీని ద్వారా పెన్షన్ తీసుకోడానికి గ్రామ సచివాలయానికి వెళ్లిన వృద్దులు వడ దెబ్బ తగిలి చనిపోయారు. లోకల్ గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు పశ్చాత్తాపం లేదు . తాను చేసిన ఫిర్యాదు వలనే దాదాపు నలభై మంది వృద్దులు చనిపోయారు, ఇదంతా ఎన్నికల సంఘానికి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు ఇవ్వడం వల్లే ఏపీలో పెన్షన్ పంపిణీకి ఇబ్బంది కలిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ఈ పెన్షన్ల పంపిణీ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.
ఈ వాలంటీర్లు రాజీనామా తో ప్రజల్లోకి వెళ్లి వైసీపీ తరుపున ప్రచారం చేస్తా అని ప్రకటించడం, వాలంటీర్లతో ఫించన్లు అపించడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు, కూటమికి పెద్ద దెబ్బ తగిలేలా కనపడుతుంది. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు కు ఓటమీ రుచి చూపించబోతున్నారా అనేది వేచి చూడాలి ఎలక్షన్ తుది వరకు ??