ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆరు లోక్సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా విశాఖపట్నం నుంచి పులుసు సత్యనారాయణరెడ్డి, అనకాపల్లి నుంచి వేగి వెంకటేశ్, ఏలూరు నుంచి కావూరి లావణ్య, నరసరావుపేట నుంచి గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ , నెల్లూరు నుంచి కొప్పుల రాజు, తిరుపతి (ఎస్సీ) రిజర్వడ్ స్థానం నుంచి డా.చింతా మోహన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా టెక్కలి నుంచి కిల్లి కృపారాణి, భీమిలి నుంచి అడ్డాల వెంకటవర్మ రాజు, విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి సంతోష్, గాజువాక నుంచి లక్కరాజు రామారావు, అరకు లోయ నుంచి శెట్టి గంగాధరస్వామి, నర్సీపట్నం నుంచి ఆర్. శ్రీరామమూర్తి, గోపాలపురం నుంచి సోడదాసి మార్టిన్ లూథర్, యర్రగొండపాలెం నుంచి డా.బూదాల అజితరావు, పర్చూరు నుంచి నల్లగొర్ల శివ శ్రీలక్ష్మీ జ్యోతి, సంతనూతలపాడు నుంచి విజేష్రాజ్ పాలపర్తి, గంగాధర నెల్లూరు నుంచి రమేష్బాబు దెయ్యాల, పూతలపట్టు నుంచి ఎం.ఎస్.బాబు పోటీ చేస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.