ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్కు అడ్డాగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నిందా.. చాలా కాలంగా బయటపడుతున్న సంఘటనలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. విశాఖపట్నంలో తెలుగు తమ్ముళ్లకు చెందిన సంధ్య ఆక్వా కంపెనీలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన వారు ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్లతో సంబంధాలు నెరుపుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని యువతను మత్తులో ముంచేందుకు ప్రయత్నించినట్లు వెలుగు చూసింది. దీంతో చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఉలిక్కిపడ్డారు. దొంగే దొంగా.. దొంగా అని అరిచిన చందాన.. విశాఖ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు. కానీ నిజం దాగదు కదా.. కంపెనీ యజమానులైన వీరభద్రరావు, కోటయ్య చౌదరికి టీడీపీతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
నిందితుడు కోటయ్య చౌదరి టీడీపీ ముఖ్య నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయులు, రాయపాటి జీవన్కు సన్నిహితుడు. ఇక సత్య విషయానికొస్తే చంద్రబాబు, లోకేశ్కు చాలా దగ్గరి మనిషి. అలాగే కోటయ్యకు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అల్లుడు కూనం ఆనంద్ (సంధ్య మెరైన్)తో కూడా సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు. కోటయ్య.. లావుకు అనుకూలంగా విశాఖలోని గ్రాండ్ బే హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అతని స్నేహితుడు సురేష్ మద్దినేని ప్రస్తుతం నరసారావుపేటలో లావు తరఫున ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.
డ్రగ్స్ ముఠాతో టీడీపీ సంబంధాలు బయట పడడంతో చంద్రబాబు, లోకేశ్కు భయం పట్టుకుంది. ఎన్నికల సమయంలో యువతను మత్తులో ముంచేందుకు తెప్పించిన మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేయడంతో ఈ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీపై నెట్టేయాలని చూస్తున్నారు. తొలుత లోకేశ్ వేసిన ట్వీట్ చూస్తేనే అర్థమైపోతుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో దిగుమతి చేసుకున్నారని ఆరోపించారు. తమకు సన్నిహితులు కావడంతోనే కంపెనీ పేరు రాయలేదు. కోటయ్య చౌదరి.. దామచర్ల సత్య, లావుతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సీబీఐ పెద్ద కుట్రను భగ్నం చేసింది. కొంత డ్రగ్స్ ఎన్నికల్లో ఉపయోగించుకుని లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చూశారు. మరికొంత మొత్తాన్ని తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్న తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారు. ఒక్క కంటైనర్లోనే 25 వేల కిలోలు దొరికిందంటే.. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి నడుపుతున్నారో.. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో దందా చేశారో ఊహించడమే కష్టం.
చంద్రబాబు గ్యాంగ్ 2014 నుంచి 19 వరకు గంజాయి వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దీనిపై ఉక్కుపాదం మోపడంతో అనేకమంది తెలుగు తమ్ముళ్లు అరెస్ట్ అయ్యారు. కారులో గంజాయి తరలిస్తుండగా చిత్తూరు జిల్లా పుత్తూరు తెలుగు యువత అధ్యక్షుడు బీఎస్ హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను లోకేశ్కు సన్నిహితుడు. గంజాయి స్మగ్లింగ్ కేసులో టీడీపీ మహిళా నేత మానుకొండ జాహ్నవిని నరసారావుపేటలో తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఇక చంద్రబాబు అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలను సహించలేకపోయారు. గతంలో అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తున్న సమయంలో గంజాయి అమ్మేవారిపై దాడులు చేస్తారా అని నిలదీశారు.
చీకటి కార్యకలాపాలు చేయడంలో ఎల్లో గ్యాంగ్ ఎప్పుడూ ముందుంటుంది. ఆ విధంగా వచ్చిన సొమ్మునే ఎన్నికల్లో ఖర్చు చేస్తుంటారు. కాకపోతే తమకేం సంబంధం లేదన్నట్లుగా ప్రత్యర్థుల పైకి నెట్టేస్తారు. వీరికి వంత పాడేందుకు పచ్చ మీడియా ఉండనే ఉంది.