అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలకి దీటుగా పరిపాలనా రాజధానిగా వేగంగా అభివృద్ది చెందుతున్న అందమైన విశాఖ నగరంపై టీడీపీ కుట్రలు ఇప్పటిలో ఆగేలా లేవు. రైతులని మోసం చేసి తాము ఎంతో డబ్బుని పెట్టుబడిగా పెట్టిన అమరావతి ప్రాంతం శాశన రాజధానిగా మారడం, పరిపాలన రాజధానిగా విశాఖ రూపు మార్చుకోవడంతో తాము అక్రమించిన భూములు విలువ ఎక్కడ పడిపోయి ఆర్ధికంగా నష్టపోతామో అన్న ఆందోళణతో విశాఖ నగరంపై రోజుకొక కుట్ర పన్నడం టీడీపీకి పరిపాటిగా మారింది.
ఒకరోజు రుషికొండ అంటారు, మరో రోజు భూములు కబ్జా అంటారు, ఇప్పుడు గంజాయి అంటూ విశాఖపై విషం కక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖ సౌత్ నియోజక వర్గంలో శాఖారావం అంటూ నానా హంగామ చేసిన లోకేష్ అధికార వైసీపీ పై పసలేని విమర్సలు చేసి నవ్వులపాలయ్యాడు. ఏపీలో గంజాయి టాప్ అంటూ విశాఖ గంజాయికి రాజధానిగా మారిందంటూ విశాఖ బ్రాండ్ ని దెబ్బతీసే విధంగా నోటికి పనిచెప్పాడు. అయితే విశాఖ వాసులు మాత్రం లోకేష్ మూర్ఖత్వాన్ని పరిపక్వత లేమిని చూసి నవ్వుకోవడం కనిపించింది. ఏపీ గంజాయిలో టాప్’ అనటానికి… ‘గంజాయిని నిరోధించటంలో ఏపీ టాప్’ అనటానికి తేడా కూడా తెలియదా లోకేష్ కి అంటూ సెటయిర్లు పడ్డాయి.
మన్యం ప్రాంతంలో దళారుల చేతుల్లో పావులుగా మారిన కొంతమంది అమాయక గిరిజనులు చేస్తున్న గంజాయి సాగు అనేది కొన్ని తరాలుగా జరుగుతూనే ఉంది. నిజానికి నేడు వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో గంజాయి సాగుపై ఉక్కుపాధం మోపారు. గత తెలుగుదేశం పాలనలో విశాఖ నగరంలో గంజాయి ఏస్థాయిలో ఉందో నాటి తెలుగుదేశం మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస్ గారే ప్రస్ మీట్లో చెబుతూ, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయని, విశాఖ నగరంలో స్కూల్ బస్సుల్లో కూడా గంజాయి దొరుకుతుందని, దీనివెనక కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉందని చెప్పారు.
అయ్యన్నపాత్రుడు వర్గం, ఆయన అనుచరులకు నర్సీపట్నం, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి వ్యాపార లావాదేవీల్లో జోక్యం ఉందని సమాచారం ఉన్న గంటా ఆ వైపుగా అయ్యన్నను ఇరుకున పెట్టడానికే ఇలా చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కున్నాయి. అయితే అయ్యన్న మాత్రం ఈ గంజాయి స్మగ్లింగ్ వెనకాల మా ప్రభుత్వంలో పోలీసుల హస్తం కూడా ఉందని మరో బాంబ్ పేల్చి విశాఖ వేదికగా రచ్చకి తెరలేపారు. వీరి గంజాయి వ్యాపార లింకులు వ్యవహారం బయటికి రావడంతో చంద్రబాబు రంగంలోకి దిగి రాజీ చేసినట్టు నాడు పత్రికల్లో కూడా వచ్చిన వార్త.
అయితే తెలుగుదేశం పాలనలో గంజాయి స్మగ్లింగ్ అనేది నాయకులే కాకుండా ఆ పార్టీ చోటా నేతలు కూడా చేశారు అనడానికి పోలీసుల రికార్డులే సాక్ష్యం. గత పాలనలో టీడీపీ చోటా నాయకులు మొదలు పెట్టిన గంజాయి స్మగ్లింగ్ వైసీపీ పాలనలో కూడా కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గంజాయి సాగుపై , స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపడంతో టీడీపీ నేతలు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఉదాహరణకి తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తూ దొరికిపోయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు. తెలుగు యువత అధ్యక్షుడు హరికృష్ణ, గంజాయి అక్రమ రవాణా కేసులో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో తెలంగాణ పోలీసులు నరసరావుపేటలో అరెస్టు చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ లో టీడీపీ చోటా నాయకులు , కార్యకర్తలే డజనలకొద్ది ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి మహమ్మారి సమూల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో విభిన్న శాఖల సహకారంతో పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టిసారించి సత్ఫలితాలను సాధిస్తోంది. గిరిజనులే స్వచ్ఛందంగా గంజాయి సాగుకు తిలోదకాలు ఇచ్చేలా. అవగాహన సదస్సులతో గిరిజనుల్లో అధికారులు చైతన్యం తీసుకొస్తున్నారు. దేశంలోనే ఎన్నడూ.. ఎక్కడా జరగని రీతిలో 2022 ఫిబ్రవరిలో ఒకే రోజున 300 కోట్లకు పైగా విలువ చేసే రెండు లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేయడం ఒక రికార్డు. అటవీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయిని సమూలంగా నాశనం చేయడంలో భాగంగా గిరిజనులకు లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు సీఎం జగన్ ప్రణాళికను రూపొందించారు. 4.5 ఏళ్ల పాలనలో 144 కోట్ల పైగా విభిన్న ప్రోత్సాహకాలను అందజేసారు. వేలాది మంది గిరిజనులకు లక్షల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ (RoFR) పట్టాలిచ్చి వారికి యాజమాన్య హక్కులు కల్పించి శాశ్వత జీవనోపాధికి బాటలు వేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో గంజాయికి చెక్ పెట్టడంలో సత్ఫలితాలు సాధించారు.
సీఎం జగన్ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఏర్పాటు చేసిన గట్టి నిఘాతో గంజాయి స్మగ్లింగ్ కి అడ్డుకట్ట పడి అనేక మంది అరెస్ట్ అవ్వడం జరుగుతూనే ఉంది. అయితే వారిని చూపుతూ గంజాయి ఎక్కువ ఉంది అని లోకేష్ చెప్పే ప్రయత్నం చూస్తే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమం చేసినట్టు స్పష్టమౌతుంది. గంజాయి స్మగ్లింగ్ లో టీడీపీ వారే పట్టుబడటంతో లోకేష్ విశాఖ బ్రాండ్ పై విషం చిమ్మడం చూస్తే విశాఖపై టిడీపీ పార్టీ నిలువెల్లా ఎలా విషం నింపుకుందో అర్ధమవుతుందని విశాఖ వాసుల నుండి వినిపిస్తున్న మాట.