2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. 2024 అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్రంలో సరైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది విశాఖనే అని మరోసారి స్పష్టం చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని కర్నూలును న్యాయ రాజధానిగా […]
రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేమంతా సిద్దం పేరిన బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు జగన్, నేడు 21వ రోజున బస్సుయాత్ర ఉత్తరాంద్ర విశాఖకు చేరిన విషయం తెలిసిందే. తొలి నుండి విశాఖని పరిపాలనా రాజధానిగా మార్చాలనే దృడ సంకల్పంతో ఉన్న జగన్ నేడు విశాఖలో జరిగిన సోషల్ మీడియా మీట్ లో మరోసారి తన ఆకాంక్షను సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పంచుకున్నారు. కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన జగన్ విశాఖకు సిటీ […]
2014 ఎన్నికల్లో వైజాగ్ నుండి ఎంపీ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సతీమణి, వైఎస్ జగన్ తల్లి గారైన వైయస్ విజయమ్మ వైసీపీ నుండి బరిలోకి దిగగా… కడప వాళ్లు వైజాగ్ లో గెలిస్తే వైజాగ్ లో భూములు కబ్జా చేస్తారు, కడప నుండి పంచెలు కట్టుకుని వచ్చి మీ వ్యాపారాలన్నీ నాశనం చేస్తారు. ఖూనీలు చేస్తారు అని టీడీపీ మనుషులని పెట్టించి మరీ ప్రచారం చేసింది, నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఉద్యోగులతో […]
మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తూ.. పదే పదే పార్లమెంట్లో గళం వినిపించిన జీవీఎల్ గారికి బీజేపీ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం’ విశాఖపట్నంలో జన జాగరణ సమితి పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ ఇది. బీజేపీకి విశాఖలో టీడీపీ కంటే ఎక్కువ పట్టు ఉంది. కానీ జీవీఎల్ నరసింహారావును తొక్కేయడానికి ఏపీ కమలం చీఫ్ పురందేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి కుట్రలు పన్నారు. ఆమె పక్కాగా స్కెచ్ వేసి ఈ సీటును తన […]
పరిపాలన రాజధాని దిశగా అడుగులు పడుతున్న విశాఖ నరగాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు అత్యాధునిక మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పార్కులు, రోడ్లు, జంక్షన్లు అన్నిటి రూపు రేఖలు మారుస్తూ సుందర నగరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రత్యకంగా దృష్టి సారించడంలో ఇప్పటికే అనేక చోట్ల పలు అభివృద్ది పనులు పూర్తి చేసుకున్న తరుణంలో విశాఖ నగరం ఇప్పుడు దేశ విదేశాల నుండి వస్తున్న టూరిస్టులని ఆకర్షిస్తుంది. తాజాగా విశాఖలోని హనుమంత వాకా […]
విశాఖపట్నం పోర్టు అధారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పి చరిత్రను తిరగరాసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగు రోజులు మిగిలి ఉండగానే పోర్టు చరిత్రలోనే మొదటిసారి ఒక్క రోజులోనే 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి పాత రికార్డులను అధిగమించింది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల విశాఖ పోర్టు చైర్ పర్సన్ డాక్టర్ ఎం. అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు నూతన రికార్డును సృష్టించడంలో కీలకంగా వ్యవహరించిన ట్రాఫిక్ […]
విశాఖపట్నంలో బయటపడిన డ్రగ్స్కు సంబంధించి సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడ స్కాంలు బయటపడినా అందులో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉంటోంది. డ్రగ్స్ వ్యవహారాన్ని ఆ పార్టీ నేతలే దగ్గరుండి నడిపించినట్లు స్పష్టమవుతోంది. 25 వేల కేజీల డ్రగ్స్ కేసుపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తెలుగుదేశం పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా సంధ్యా ఆక్వా యజమాని కోటయ్య చౌదరికి పేరుంది. దేశంలో […]
విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం రేగింది. తెలుగుదేశానికి చెందిన వ్యక్తుల కంపెనీలో 25 వేల కిలోల డ్రగ్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన జిన్ లియన్ యన్ గ్యాంగ్ నౌక ఈనెల 16వ తేదీన విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. ఈ షిప్లోని ఎస్ఈకేయూ 4375380 నంబర్ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని ఈనెల 18న ఇంటర్పోల్ నుంచి సీబీఐకి సమాచారం అందింది. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. మండే ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి 20 బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావం మేరకు కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ […]
ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పరిరక్షణకు విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్పై రీసెర్చ్ సెంటర్ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్సీసీఆర్) నిర్మించింది. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.62 కోట్ల వ్యయంతో ఎన్సీసీఆర్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించి, ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం […]