ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది.. టీడీపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కండువా కప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కేశినేని నాని తన కుమార్తె శ్వేతతో సహా టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నల్లగట్ల స్వామిదాస్ కూడా టీడీపీని వీడడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.. గతంలో 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా స్వామిదాస్ గెలుపొందారు.
చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని, 30 ఏళ్లుగా టీడీపీ కోసం కష్టపడినా కనీసం ఇంట్లోకి రానివ్వలేదని కృష్ణ దాస్ వెల్లడించారు. టీడీపీ నేతలే తమకు వెన్నుపోటు పొడిచారని కృష్ణదాస్ తెలిపారు. దళితుల సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని అవి నచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని, సీఎం జగన్ ఏం చెప్పినా తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కృష్ణదాస్ తెలిపారు..