తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిలాగే ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తుంటారు. కొంతకాలం క్రితం వరకు తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన్ను చూసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చాలా నేర్చుకోవాలని ఆ రాష్ట్రంలో నివాసం ఉంటున్న, ఏపీలోని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. ప్రతి విషయంలో పోలిక తెచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేసేవారు. మరిప్పుడు అదే తమ్ముళ్ల స్వరం పూర్తిగా మారింది. తమకు కావాల్సిన వ్యక్తి సీఎంగా ఉండడంతో కేసీఆర్, కేటీఆర్పై అవమానకరంగా పోస్టులు పెడుతున్నారు.
మొన్నటి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన హరీష్రావు, నేతలు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడ్చారు. మేము అభివృద్ధి చేసేశాం.. ఆంధ్రాలో ఏమీ జరగలేదని ప్రచారం చేశారు. అయితే ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడిగా పేరున్న శిష్యుడు రేవంత్రెడ్డి సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభిమానులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే వారి అతే ఎక్కువైంది. తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో కేటీఆర్ను టార్గెట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏపీని చులకన చేసేందుకు ఆయనపై అనేక సందర్భాల్లో పొగడ్తల వర్షం కురిపించారు. కంపెనీలు తెచ్చాడంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అదే తమ్ముళ్లు ఒకప్పుడు కేటీఆర్ చేసిందంతా షో అని, అధికారులు పనిచేస్తే క్రెడిట్ కొట్టేశారని రాస్తున్నారు. అవమానించేలా ఫొటోలు, మీమ్స్ తయారు చేసి పెడుతున్నారు.
తాజాగా తెలుగుదేశం ఎన్నారై విభాగానికి చెందిన కేసీ చేకూరి కేటీఆర్ను తీవ్ర పదజాలంతో అవమానించారు. ‘అడ్డెడ్డే… ఏం గతి పట్టిందిరా అయ్యా కల్వకుంట్ల డ్రామారావుకి.. వెనకాల ఉన్న జయేష్ రంజన్ సాధించేవి అన్నీ ఆయన ఖాతాలో వేసుకుని, ప్రభుత్వం దన్నుతో ఐదేళ్ల నుండీ అపర మేధావి, సకల విద్యాపారంగతుడు టైపులో బిల్డ్ చేసిన ఇమేజ్ కాస్తా.. ఓడిపోయిన రెండు నెలలకే తెలుగు సినిమాల్లో, హిందీ వెబ్ సిరీసుల్లో, సోషల్ మీడియాలో ఉన్న కామెడీ స్టార్స్.. బ్రహ్మి కేరక్టర్స్, చిట్టినాయుడు, పిల్లి పద్మనాభసింహ, ఉప్పల్ బాలు, డీజే టిల్లు, బిల్లా-రంగా… మీమ్స్ తో ట్రోలింగ్ చేయబడే జోకర్ స్థాయికి దిగజారి పోయిందిగా. ఆఖరికి బ్రహ్మి మీమ్స్లో బ్రహ్మి బదులు ఇతన్నే వాడతన్నారు. మరేం పర్లేదులే! తెలంగాణా నిండు అసెంబ్లీలో కూర్చుని, అక్కడ లేని చంద్రబాబు గారిని ప్రస్తావించకూడదు అనే బేసిక్ లెజిస్లేటివ్ బిజినెస్ రూల్ లెక్కచేయకుండా, మందబలంతో ఎర్రగడ్డ ఆలుగడ్డ అని వెకిలిగా, హేళనగా ట్రోలింగ్ చేస్తూ ఎన్నిసార్లు ఎంత బలుపుగా మాట్లాడారో అయ్యకొడుకుమేనల్లుళ్లు! తిక్క కుదిరింది తీయ్..’ అంటూ పోస్టు చేశారు.
చేకూరి రాతలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అయితే ఖండించడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే రేవంత్ అండ ఉండడమే ఆ భయానికి కారణం. పోనిలే పాపమని ఓటుకు నోటు కేసులో చంద్రబాబును వదిలేస్తే ఆయన మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతూ ఒకరిద్దరు పోస్టులు పెట్టారంతే..
ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లు ఎలాంటి వారో బీఆర్ఎస్ శ్రేణులకు బాగా అర్థమైంది. తమ ప్రభుత్వాన్ని పొగిడి.. జగన్ను తిట్టినప్పుడు ఆనందించారు. అదే ఇప్పుడు రేవంత్ను హైలెట్ చేయడం కోసం కేసీఆర్, కేటీఆర్ను నానా రకాలుగా తిడుతుండటంతో జీర్ణియించుకోలేకపోతున్నారు. అసలు కేటీఆర్పై పోస్టు పెట్టిన కేసీ చేకూరిని గతంలో అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పార్టీలో పవన్ అభిమానుల మీదకి దూసుకెళ్లి కొట్టిన చరిత్ర ఉంది. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఈవెంట్ మేనేజర్లపై పిడిగుద్దులుతో విరుచుకుపడ్డాడు. వారి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగంలోకి దిగిన టీడీపీ తానా పెద్దలు.. జనసేన సభ్యులతో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. చేకూరి క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి అని పేరుంది కాబట్టే.. ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్న రేవంత్ మంచివాడిగా కనిపించాడు. ఆయన్ను వెనుకేసుకొచ్చేందుకు కేటీఆర్పై అభ్యంతరకర పోస్టు పెట్టారు. అతడి రాతలపై బీఆర్ఎస్ అభిమానులకు కోపం వచ్చినా చేయగలిందేమీ లేదు. భవిష్యత్లో ఇలాంటి పోస్టులు చాలా వస్తాయి. గుండె రాయి చేసుకుని వచ్చే ఎన్నికల వరకు కాలం గడపాల్సిందే..
అసలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కేటీఆర్ కంట ఈ పోస్టు పడిందో లేదో.. ఒకవేళ ఎవరైనా చూపించినా అధికారంలో లేము కదా అని లైట్ తీసుకుంటారో.. చేకూరి.. ఇలా ఒకసారి ప్రయత్నించండి. కేటీఆర్ ఇంగ్లిష్, తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతారు. రేవంత్ చేత ఇంగ్లిష్లో, లోకేశ్ చేత తెలుగులో తప్పులేకుండా మాట్లాడించి అప్పుడు కంపేర్ చేస్తూ పోస్టు పెట్టండి. ఎవరు పనిమంతుడో తెలిసే అవకాశం ఉంది.