2024 ఎన్నికలకు ఇంకా ఒక నెల కూడా సమయం లేదు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీలోకి వలసలు ఊపుందుకున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీజెపీ టీడీపీ జనసేన పార్టీల నుంచి కీలక నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కట్టారు. ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత గండి రవి కుమార్ జాయిన్ అయ్యారు. గండి రవి కుమార్ తో పాటు మరో కీలక నేత డెడ్డం ప్రసాద్ రావ్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గండి రవి కుమార్ టీడీపీలో పెందుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. రవి కుమార్ 2014 బండారు సత్యరాయణమూర్తి గెలుపుకు తీవ్రంగా కృషి చేశాడు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడుగా గండి రవికుమార్ కి పేరుంది. నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో అనకాపల్లి జిల్లాలో టికెట్ ఆశ చూపించి ఖర్చు పెట్టించారు. ఇటీవల జరిగిన నారా లోకేష్ శంఖారావం సభలో కూడా అసెంబ్లీ టికెట్ నీదే అంటూ హామీ ఇచ్చి, ఆ హామీని తుంగలో తొక్కుతూ పొత్తులో భాగంగా జనసేన కు కేటాయించాల్సి వస్తోంది అని చెప్పి జారుకున్నాడు. ఇలా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ నుంచి కీలక నేతలు జారుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ నుంచి వేంపల్లి సతీష్ రెడ్డి, బీజెపీ నుంచి భూమా కిషోర్ రెడ్డి, జనసేన నుంచి కాపు సంక్షేమ నాయకుడు హరి రామ జోగయ్య కుమారుడు జాయిన్ అయ్యారు.రేపో మాపో కాపు నేత ముద్రగడ పద్మనాభరావు కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచుకోనున్నారు.