తాము అధికారంలో ఉన్నప్పుడు తమ సొంత వారికే నిబంధనలు అన్నీ పక్కన బెట్టి మరీ ఓపెన్ టెండర్లు ఆహ్వానించకుండా తమకు నచ్చిన వారికే కాంట్రాక్టులు అన్నీ కట్టబెట్టే బాబు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నిబంధనలను అన్ని పాటించి ఓపెన్ టెండర్ల ద్వారా ప్రాజెక్ట్ కాంట్రాక్టులు పొందిన వారిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం పరిపాటే.. ఇదోరకమైన బ్లాక్మైలింగ్ అన్నమాట..
ఎవరు అధికారంలో ఉన్నా, ఏ సంస్థ కాంట్రాక్టులు పొందినా తమ వాటా తమకు దక్కాల్సిందే అనుకుని వారిపై లేనిపోని ఆరోపణలు చేసి చివరికి వారి చేత పార్టీ ఫండ్ ఇప్పించుకోవడం బాబుకు వెన్నతోపెట్టిన విద్య. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి అండగా ఎల్లో మీడియా ఉండనే ఉంది..
సక్రమమైన మార్గంలో పోలవరం కాంట్రాక్ట్ పొందిన మేఘా ఇండస్ట్రీస్ ను రకరకాలుగా బెదిరించి, లేనిపోని ఆరోపణలు చేసిన బాబు అదే సంస్థ నుండి 27 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ను ఎలక్టోరల్ బాండ్స్ రూపం లో పొందాడు.. ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుడు అనీ అతను జగన్ కు సన్నిహితుడు అనీ, ఆ స్కామ్ లో జగన్ కూ సంబంధం ఉందని అర్థం లేని ఆరోపణలు చేసి సదరు శరత్ చంద్రారెడ్డి కి చెందిన అరబిందో సంస్థ నుండి 2.5 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పొందాడు… షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ, ఆ సంస్థ పులివెందుల వాళ్ళది అంటూ, భూములన్నీ ఆ కంపెనీ కి జగన్ ఇచ్చేస్తున్నాడు అంటూ నాలుగేళ్ళ నుండి నానా యాగీ చేసి వాళ్లనుండి 40 కోట్లు పార్టీ ఫండ్ ఎలెక్ట్రోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నారు టీడీపీ పార్టీ వారు.
ఇలా తలాతోకా లేని ఆరోపణలు చేయడం, సదరు వ్యాపార సంస్థను భయబ్రాంతులకు గురిచేసి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక వారు తమ పార్టీ కి నిధులు ఇచ్చేలా చేయడం బాబు యొక్క “అరాజకీయ” చాణుక్యం. బాబు అధికారం లో ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా ఎవరి వాటా వారు ఇవ్వాల్సిందే అది నయానో, భయానో లేక బ్లాక్మైలింగ్ ద్వారానో….