చంద్రబాబు బిజేపీ పొత్తు పొడిచినట్టే . తాను ఏంచేసినా లోకకళ్యాణం కోసం, తీసుకునేవన్నీ చారిత్రాత్మక నిర్ణయాలే అని భావించే బాబు ఢిల్లీలో పగలు రాత్రి కాపు కాచి ఎట్టకేలకు బీజేపీతో పొత్తుని ఖరారు చేసుకున్నట్లుంది . బీజేపీకి ఆరు యంపీలు, పదహారు ఎమ్మెల్యేల సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చేందుకు బాబు ఒప్పుకున్నారని సమాచారం . ఢిల్లీలో ఈ నెల 14 న NDA మీటింగ్ జరిపి.. అధికారికంగా పొత్తులు ఆ రోజు ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. బీజేపికి కావలసిన ఆరు ఎంపీలను నిర్ణయించిన అమిత్షా..ఎమ్మెల్యేల విషయం రాష్ట నాయకత్వంతో మాట్లాడుకోవాలని సూచించారు.
హిందూపూర్ పరిపూర్ణానందకు మాటిచ్చానని అది వదులుకోలేనన్న అమిత్ షా, హిందూపురం – పరిపూర్ణానందకు, నరసాపురం -రఘురామకు, తిరుపతి -రత్నప్రభకు,రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డికు, అరకు – కొత్తపల్లి గీతకు, రాజమండ్రి – పురంధరేశ్వరికు నిర్ణయమయిందని వార్తలు వస్తున్నాయి .
అంటే టీడీపీ నుండి చేర్చుకొన్న సుజనా, సీఎం రమేష్, టిజీ వెంకటేష్ లకు మొండి చెయ్యి చూపెట్టినట్టే. ఈ లెక్కలతో బీజేపి కి పదహారు ఎమ్మెల్యేలు, ఆరు ఎంపీలను, , జనసేనకు 2 ఎంపీ, 24 ఎమ్మెల్యేలను ఇచ్చేయగా మిగిలిన స్థానాలకు తెదేపా సరిపెట్టుకోనుంది. మరి అసంతృప్త తెలుగు తమ్ముళ్ళు రెండవ లిస్టు వచ్చాక ఎలా రియాక్టవుతారో చూడాలి మరి.