ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కి తనేం చేసినా అదో మహత్కార్యం.. అవతలి వ్యక్తి ఏం చేసినా అదో పెద్ద నేరం లా కనిపిస్తుంటాయి… తెల్లారి లేస్తే తెలుగు ప్రజలందరికీ “అటా” అంటూ నీతులు వల్లిస్తూ తను మాత్రం ఏ నీతి లేకుండా బతికెయ్యడం, తనదే నీతివంతమైన “ బతుకు “ అని బ్రమలో బతకడం రాధాకృష్ణ కి సహజ నైజం..
వివరాల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానికి ఎలా అయినా అడ్డుపుల్ల వేయాలనుకుని ఆ కార్యం అక్రమం అంటూ గగ్గోలు పెట్టె రాధాకృష్ణ తన అక్రమాలను మర్చిపోతూ ఉంటాడు.. ఫిల్మ్ స్టూడియో కట్టుకోవడానికి రెండెకరాల స్థలం కేటాయిస్తే రాద్దాంతం చేసిన రాధాకృష్ణ కి, టీడీపీ హయాం లో తను అక్రమం గా పొందిన భూముల గురించి మాత్రం మర్చిపోయాడు..
1986 లో ఆంధ్ర ప్రింటర్స్ పేరిట అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎకరన్నర కేటాయించింది అని, దానిలో ఎకరం రోడ్ వైడెనింగ్ లో కోల్పోయాం అని, ఇప్పుడు ఆ ధరకి తమకి భూమి కేటాయించాలని 2017 లో విన్నవించుకుంటే టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో జారీ చేసి భూమిని కేటాయించింది.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ భూమిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదని కాబట్టి వెనక్కి తీసుకుంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోగా, సదరు ఆంధ్రజ్యోతి యాజమాన్యం కోర్టు కి వెళ్లింది.. ఆరా తీయగా తెల్సింది ఏమిటంటే అసలు 1986 లో ప్రభుత్వం ఆంధ్ర జ్యోతికి గాని, ఆంధ్ర ప్రింటర్స్ కి గాని ఎలాంటి భూ కేటాయింపు చేయలేదు, అసలు అలాంటి కేటాయింపు జరిగినట్లు గా ఆంధ్రజ్యోతి యాజమాన్యం వద్ద ఎలాంటి ఆధారము లేదు.. అంటే ఎప్పుడో 1986 లో భూమి కేటాయిస్తే అది రోడ్ వైడెనింగ్ లో పోయిందని ఒక అబద్ధపు కథను అల్లి 1986 లో కేటాయించిన భూమి స్థానంలో 30 ఏళ్ల తర్వాత అంటే 2017 లో అప్పటి రేటు అనగా ఎకరా పదివేలకే భూమిని బాబు ప్రభుత్వం నుండి పొందారు… ఇంకొక అరెకరం కోసం 2017 లో 50 లక్షలు చెల్లించారు. ఎకరం 10 కోట్లు ఉన్న చోట ఎకరన్నర భూమి కేవలం 50 లక్షలకే పొందాడు..అసలు కేటాయింపే జరగకుండా జరిగిందని, మా భూమి రోడ్డు విస్తరణ లో పోయిందని కోర్టు వారికే అబద్దపు సాక్ష్యాలు సమర్పించారు అంటే రాధాకృష్ణ ఎంత 420 నో అర్థం చేసుకోవచ్చు…
ఇదొకటే నా?
దానికి ముందే అనగా 2015 లో పత్రికా ముద్రణ కార్యాలయం ఏర్పాటు సాకుతో రేణుగుంట మండలం, తూకివాకం గ్రామ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఎకరన్నర స్థలాన్ని జీవో నంబర్ 433 విడుదల చేసి కేటాయింపులు చేసారు.. ఆ ప్రాంతంలో ఎకరా 7 కోట్లు ఉండగా కేవలం ఎకరం 80 లక్షల చొప్పున ఎకరన్నర స్థలాన్ని కేటాయించారు.. అంటే 10 కోట్లకి పైగా విలువ చేసే భూమిని కేవలం 1.20 కోట్లకే కేటాయించారు.. ముద్రణా కార్యాలయం నిర్మించాలని తీసుకున్న ఆ స్థలం లో ఇంతవరకు ఎలాంటి నిర్మాణమూ చేపట్టలేదు..
ఇకపోతే… ఏపీ అసెంబ్లీ సమావేశాల లైవ్ టెలికాస్ట్ కి సంబంధించిన హక్కులను ఏకపక్షంగా ABN ఛానెల్ కే బాబు కట్టబెట్టాడు.. దానికోసం నిబంధనలు అన్నీ పక్కన బెట్టాడు.. అందుకే బాబు పై రాధాకృష్ణకి ఎనలేని ప్రేమ…
ఇలా చెప్పుకుంటూ పోతే బాబు ప్రభుత్వం లో ఎంతగానో లాభపడ్డ రాధాకృష్ణ, జగన్ ప్రభుత్వం లో తన పప్పులు ఉడకడం లేదని తన బ్లాక్మెయిల్ లకి తలవొంచడం లేదని ప్రతీ రోజూ జగన్ పై విషం చిమ్మడమే తన జీవిత లక్ష్యం గా పెట్టుకున్నాడు. పెట్టుకుంటే పెట్టుకున్నాడు గానీ, తానో గొప్ప నీతివంతుడిలా అందరికీ నీతులు చెప్పడం, అందరూ తనలాగే, తనే కరెక్టు అనుకుంటూ బతకాలి అనుకోడమే ఏమీ బాగోలేదు..