వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆడబిడ్డల ఆనందం చూడలేని టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు ఓ మహిళ ఆత్మహత్యకు కారణమయ్యారు. కొద్దిరోజుల క్రితం తన సొంత ఇంటి కల నెరవేరిందంటూ ఆనందాన్ని వ్యక్తపరిచిన ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డ గీతాంజలి అనంత లోకాలకు వెళ్ళిపోయింది.. ఆ సొంతింటిలో అడుగుపెట్టకముందే ప్రాణాలు విడిచింది. జనసైనికులు, తెలుగు తమ్ముళ్ళు చేసిన వెర్రి చేష్టలకు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.
గీతాంజలి.. ఈ పేరు గతవారం నుండి సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుపరిపాలనకు అద్దం పట్టేలా తన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మధ్యతరగతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి గురించి ఆనందంగా చెబుతూ.. తన పిల్లలు అత్తమామలతో కలిసి ఉండేందుకు తన పేరు మీద సొంత ఇళ్ళు ముఖ్యమంత్రి ఇచ్చారంటూ.. తన కల నెరవేరిందంటూ ఆ వీడియోలో సంబరపడుతూ చెబుతుంది గీతాంజలి.. అయితే ఆ వీడియోతో గీతాంజలి ఎంతోమందికి దగ్గరయ్యింది. అలానే టీడీపీ, జనసేన మూర్ఖులకు టార్గెట్ గా మారింది. తను మాట్లాడిన మాటలను ఆ పార్టీల ఆకతాయిలు ట్రోల్ చేస్తుంటే తట్టుకోలేకపోయింది. మార్చి 7వ తేదీన ఆత్మహత్య చేసుకునేందుకు రైలు కింద పడగా, మృత్యువుతో పోరాడుతూ నిన్న ప్రాణాలు వదిలింది.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన గీతాంజలి మరణానికి టీడీపీ, జనసేన పార్టీల ఆకతాయిలే కారణం.. ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మానసికంగా హింసించి.. చివరకు ఆమె మరణానికి కారణమయ్యారు. తాజాగా గీతాంజలి మృతిపై ఆమె భర్త బాలచందర్ సంచలన విషయాలను చెప్పారు.. గీతాంజలి హావభావాలతో ట్రోల్స్ చెయ్యడం, వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యడం తన భార్య తట్టుకోలేకపోయిందంటూ బాలచందర్ కన్నీరుమున్నీరయ్యారు. గీతాంజలి ఇద్దరు బిడ్డలు తల్లిలేని పిల్లలయ్యారు. వారు తల్లి మృతదేహం ముందు ఏడుస్తున్న దృశ్యాలు అందరి హృదయాలను బరువెక్కించాయి.
సీఎం జగన్ సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే… బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ప్రస్థుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి ట్రెండింగ్ అవుతుంది..
ఆడబిడ్డలను ఆదుకునే ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే వారిని హింసించి వారి బాధలకు కారణమయ్యే పార్టీలు టీడీపీ, జనసేనలు..