టీడీపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉన్నవాటికి నేడు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు . పెండింగ్ లో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు నిర్ణయించిన అభ్యర్థులు వీరే
అసెంబ్లీ అభ్యర్థులు
చీపురుపల్లి – కళా వెంకట్రావు
భీమిలి – గంటా శ్రీనివాసరావు,
పాడేరు – వెంకట రమేశ్ నాయుడు,
దర్శి – గొట్టిపాటి లక్ష్మి,
రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం,
ఆలూరు – వీరభద్రగౌడ్,
గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్,
అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,
కదిరి – కందికుంట వెంకటప్రసాద్,
పార్లమెంట్ అభ్యర్థులు
విజయనగరం – కలిశెట్టి అప్పలనాయుడు,
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి,
కడప – భూపేశ్ రెడ్డి,
అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ,
దాదాపు అందరు అభ్యర్థులు ఊహించిన వారే కాగా చివరి లిస్టులో నైనా నర్సాపురం ఎంపీ రఘురామరాజుకి ఏదైనా ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించి అతని పరువు కాస్తాయినా నిలుపుతాడు చంద్రబాబు అని అందరూ ఊహించగా ఈ లిస్టుతో ఆ అవకాశాలకు కూడా తెర పడింది. నాకు మూడు రోజుల్లో టికెట్ వస్తుంది, లేకపోతే సత్తా చూపిస్తా అంటున్న రఘురామ రాజు ఏమి చేస్తాడో చూడాలి.
ఈ లిస్టుతో ఇహ మిగిలిన ఆశావహుల కలలకు రెక్కలు కత్తిరించినట్టే