విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం రేగింది. తెలుగుదేశానికి చెందిన వ్యక్తుల కంపెనీలో 25 వేల కిలోల డ్రగ్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన జిన్ లియన్ యన్ గ్యాంగ్ నౌక ఈనెల 16వ తేదీన విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. ఈ షిప్లోని ఎస్ఈకేయూ 4375380 నంబర్ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని ఈనెల 18న ఇంటర్పోల్ నుంచి సీబీఐకి సమాచారం అందింది. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో డీఎస్పీలు ఉమేష్ కుమార్, ఆకాష్ కుమార్ మీనా బృందం 19న విశాఖకు చేరుకుని స్థానిక సీబీఐ డీఎస్పీ సంజయ్కుమార్ సమల్ తదితరులతో కలిసి పోర్టులో తనిఖీలు చేపట్టింది.
25 కేజీల చొప్పున వెయ్యి బ్యాగ్లు.. మొత్తం 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ దొరికింది. ఈ పౌడర్లో కొకైన్, మెథాక్వాలోన్, ఓపీఎం, మారిజోనా, హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు వేర్వేరు పరీక్షల్లో తేలింది. సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ. ఆయన కుమారుడు కోటయ్య చౌదరి సీఈఓగా ఉన్నారు. ప్రతినిధులను అధికారులు ప్రశ్నించగా తమకేమి తెలియదని బుకాయించారు.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి అని బయట పడింది. అలాగే టీడీపీ నేతలు, బాలకృష్ణ వియ్యంకుడితో సన్నిహిత సంబంధాలున్నాయి. సంధ్య ఆక్వాకు ఘనమైన చరిత్ర ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాని యజమానులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. అనుమతి లేకుండా ఈక్విడార్ నుంచి రొయ్యలు దిగుమతి చేసుకుని ప్రాసెస్ చేసి అమెరికాకు తరలించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలం క్రితం చేసిన తనిఖీల్లో వెల్లడైంది. ఇంకా కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లఘించారు. దీంతో సంధ్య ఆక్వాను సీజ్ చేశారు.
వీరభద్రరావు పలు కేసులుకున్నట్లు వెలుగు చూసింది. ఈ ఏడాది జూలైలో ఆయన లాస్ ఏంజెలిస్ నుంచి న్యూయార్క్కు విమానంలో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఎఫ్బీఐ అరెస్ట్ చేసింది. న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కొందరు తానా ప్రతినిధుల సాయంతో బయటపడినట్లు తెలిసింది. కౌటయ్య చౌదరికి నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలుతో పాటు అనేకమంది టీడీపీ యువనేతలతో దగ్గర సంబంధాలున్నాయి.