వైసీపీ నుండీ గెలిచి, నష్టాల్లో ఉన్న తన పవర్ కంపెనీలని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేయమని జగన్ని కోరితే దానికి ఒప్పుకోనందుకు రెబల్ గా మారి టీడీపీతో కలిసి చిల్లర వేషాలన్నీ వేసిన రఘురామ కృష్ణ ఇప్పుడు బాబుకు కూడా అడ్డం తిరిగాడు… నర్సాపురం పార్లమెంట్ సీటు పొత్తులో భాగంగా బీజేపీ కి కేటాయించగా, బీజేపీ ఆ సీటును శ్రీనివాస వర్మకు కేటాయించింది. ముందు నుండి ఆ సీట్ నాదే అని ఆశలు పెట్టుకున్న రఘురామ కృష్ణ కు గట్టి షాక్ తగిలినట్లయింది. దీనితో బీజేపీ తనకు సీట్ ఇవ్వకోవడానికి కారణం జగనే అంటూ ఆరోపణలు చేశాడు..
ఇప్పుడు తాజాగా బాబుపై కూడా విరుచుకుపడ్డాడు. ఎక్కడో తెలంగాణ కు చెందిన బీజేపీ స్పోక్స్పర్సన్ కు బాపట్ల ఎంపీ సీటు ను టీడీపీ ఇవ్వగా లేనిది, పార్టీ కండువ కప్పుకోలేదనే నెపంతో నాకు ఇవ్వకపోవడం ఏంటి? నా సీటు గురించే బీజేపీతో పోరాడలేని బాబు, రేపు అధికారంలోకి వస్తే పోలవరం గురించి బీజేపీ పై ఏ విధంగా పోరాడతాడు అని బాబును ఇరికించాడు… ఇన్ని రోజులు పాలు పోసి పెంచినందుకు బాబుకే కాటు పడింది..
అయినా జగన్ వల్ల నేను గెలవడం ఏంటి? నా సొంత బొమ్మతో నేను గెలిచా, నేను ఎందుకు రాజీనామా చేయాలి అని పలుమార్లు టీవీ డిబేట్ లలో చెప్పిన రఘురామకృష్ణ ఇప్పుడు వారెవరో టికెట్ ఇవ్వలేదని భాధపడటం ఏమిటి? తన సొంత బొమ్మతోనే నర్సాపురం నుండే ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్లీ సొంతగానే గెలవచ్చు కదా? పోనీ తన పోరాటం అంతా అమరావతి ప్రజల కోసమే అని పదే పదే చెప్పుకున్న ఆయనే గుంటూరు నుండి పోటీ చేయవచ్చు కదా? సొంత ఇమేజ్ ఇంత పెట్టుకుని ఎవరినో టికెట్ అడుక్కునే ఖర్మ మీకేంటి రాజు గారూ?