గత రెండు రోజులుగా ఏపీ మొత్తం టీడీపీ, తన అనుబంధ సంస్థ ద్వారా వాలంటీర్లు ఫించన్ ఇవ్వకుండా ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదుల చేసి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఫించన్ ఇవ్వకుండా అడ్డుకున్న వైనంతో రాష్ట్రం మొత్తం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరి ముఖ్యంగా వృద్ధులు టీడీపీ మీద రగిలిపోతూ ఎక్కడిక్కడ తమ గోడును వెళ్ళబోసుకుంటు రగిలిపోతున్నారు. మరో వైపు తమ మీద టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు, ప్రచారాలకు మానసిక దాడులకు తట్టుకోలేక వృద్ధులకు ఫించన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అని వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. అంతే కాకుండా తమ మానసిక క్షోభకు కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులను ప్రజలకు వివరిస్తాము అంటూ ప్రకటించారు.
ఇప్పుడు రాష్ట్రం మొత్తం వృద్ధులు, వాలంటీర్ల దెబ్బతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారానికి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎక్కడిక్కడ వృద్ధులు, వికలాంగులు మా ఫించన్ లు దేనికి అపించారు అని అడుగుతుండే సరికి జవాబు ఇవ్వలేక ఎలక్షన్ ప్రచారాలు చెయ్యకుండా ఆగిపోయారు, మరో వైపు వాలంటీర్లు రాజీనామాలు చేసి వాళ్లు దేనికి రాజీనామా చేశారో తమకు టీడీపీ చేసిన ద్రోహలను ప్రజల దగ్గరకు వెళ్ళి వివరిస్తూ వుండే సరికి టీడీపీ నాయకులు తమ గెలుపు మీద ఆశలు వదిలేసుకుంటున్నారు, ఇప్పుడు ఒకవైపు వృద్ధులు మరోవైపు వాలంటీర్ల దెబ్బలకు టీడీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో వృద్ధులను దేనికి ఇబ్బంది పెట్టడం అలాగే ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి కావాల్సిన పనులు చక్కబెడతున్న వాలంటీర్ల వ్యవస్థ ను దేనికి అడ్డుకుంటున్నారు అని లోపల లోపల కోపంతో రగులుతున్నారు.
చంద్రబాబు నాయుడినీ నమ్మి కోట్లకు కోట్లు ఖర్చు చేశాం తీరా చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రగిలిపోతున్నారు. మరోవైపు ప్రజలతో మమేకమైన వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు . మేము ఫిర్యాదు చెయ్యలేదు అని చెప్పడానికి వీలు లేకుండా ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతి కాపీని వాలంటీర్లు ప్రజలకు చూపిస్తూ వివరిస్తుండే సరికి కూటమి నాయకులకు అంతు పట్టడం లేదు.
ఇప్పుడు ఈ వృద్ధుల దెబ్బకు , వాలంటీర్ల రాజీనామాలతో ఏమి జరుగుతోందో అని కూటమిలో పోటి చేస్తున్న అభ్యర్థులు భయపడుతున్నారు.