పవన్ కళ్యాణ్ ఎన్నికలు వస్తున్న తరుణంలో కూటమి తరుపున తిరుపతిలో పోటి చేస్తున్న జనసేన అభ్యర్థికి టీడీపీ నుండి సహకారం లభించడం లేదని, శ్రీకాళహస్తిలో పోటిలో వున్న టీడీపీకి జనసేన నుండి సహకారం లభించడం లేదని వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి అందరి మధ్య సయోధ్య కుదర్చాలని పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతికి వచ్చారు. ఇక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ మీరు జనసేనకు ఎందుకు సపోర్ట్ చెయ్యడం లేదు, మీ చంద్రబాబు నాయుడు చెప్పాడనే అరాణి శ్రీనివాస్ ను జన సేన లోకి తీసుకుని, చంద్రబాబు నాయుడు చెప్పాడనే తిరుపతి టికెట్ ఇచ్చాను. మీ టీడీపీ చంద్రబాబు కోసం నేను త్యాగాలు చేశాను. మీరు కూడా త్యాగాలు చేసి మీ అభ్యర్థి అయిన జన సేన పార్టీ నాయకుడికి సహకారం అందించి గెలిపించాలని కోరారు.
ఇక్కడే పవన్ కళ్యాణ్ తను చంద్రబాబు నాయుడుకు ఎంత వొంగి వొంగి వున్నది బయటపెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడి కోసం పొత్తు పెట్టుకున్నారు. 40-50 సీట్లు కాకుండా 21 సీట్లకే పరిమితం అయ్యారు. చివరకు టీడీపీ నాయకులను తీసుకుని వారికే జన సేన తరుపున టికెట్లు కేటాయించారు చివరకు పక్క పార్టీ నాయకులను కూడా చంద్రబాబు నాయుడు చెప్పారని జనసేన లో జాయిన్ చేసుకొని చంద్రబాబు నాయుడు చెప్పాడని టికెట్ కూడా ఇవ్వడం పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలకు మచ్చు తునక. పవన్ కళ్యాణ్ అసలు పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం అని, ప్రత్యర్ధి పార్టీ నాయకులు అలాగే జన సేన నుండి బయటకు వెళ్లిన నాయకులు చేస్తున్న ఆరోపణలను ఈరోజు పవన్ కళ్యాణ్ నే స్వయంగా జవాబు ఇచ్చినట్లు వుంది. నేను పని చేస్తుంది చంద్రబాబు కోసమే అని వివరంగా క్లియర్ గా తన జన సేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా ఒకేసారి సమధానం ఇచ్చారు.
ఈ పరిస్థితి చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ కు సీఎం అవ్వాలి ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన లేనట్లు వుంది. కేవలం తను ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అటు కూటమిలో ఇటు ప్రతీ పక్షాల నుండి మాటల తూటాలతో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.