సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పేరుతో జనసేన 21 సీట్లలో పోటి చేస్తున్న విషయం తెలిసిందే. వీరిలో సగం మంది టీడీపీ నాయకులకే టికెట్ లు కేటాయించడం విశేషం . ఇప్పుడు తాజాగా పాలకొండ నియోజకవర్గ అభ్యర్ది గా నిమ్మక జయకృష్ణను అధికారికంగా ప్రకటించారు. నిమ్మక జయకృష్ణ కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ . ఇప్పుడు జనసేన లోకి తీసుకోని అతనికే టికెట్ కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవన్ని చూస్తున్న జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అసలు దేనికి పొత్తు పెట్టుకున్నారు, బలం లేని చోట్ల టికెట్ లు దేనికి తీసుకున్నారు, ఇప్పుడు టీడీపీ నుండి నాయకులను జనసేనలోకి తీసుకొని వారికి దేనికి టికెట్లు కేటాయించారు అని కోపంతో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై రగిలిపోతున్నారు . ఇప్పటికే భీమవరం నుండి నిన్నటి అవనిగడ్డ వరకు ఇదే తంతు జరిగింది జనసేనలో, పొత్తులో వున్న టీడీపీ నాయకులను జనసేనలోకి తీసుకొని వారికి జనసేన టికెట్ ఇవ్వడం తట్టుకోలేక వున్న కార్యకర్తలు చివరి టికెట్ అయిన పాలకొండ విషయంలో కూడ అలానే చేసేసరికి జనసేనకు వీడ్కోలు పలుకుతున్నారు.
ఏ పార్టీ అయిన సొం తంగా పోటీ చేసి ప్రజా క్షేత్రంలో నిలబడాలని కోరుకుంటాది,లేకుంటే పొత్తు పెట్టుకుంటే మెజారిటీ సీట్లలో పోటీ , బలమైన సీట్లు తీసుకుంటాయి అలాంటిది జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ విదిల్చే సీట్లను మహ ప్రసాదంగా ,జనసేన బలమైన సీట్లు టీడీపీ కి ఇచ్చి బలహీనమైన అసలు తన పార్టీ కి అభ్యర్దులే లేని చోట టికెట్ లు తీసుకొని రాజకీయంగా జనసేన పార్టీ కి ఉనికి లేకుండా చేసారు . ఇప్పుడు అ తీసుకున్న సీట్లలో కూడ తన కోసం తన పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న నాయకులను కాదు అని పొత్తులో వున్న టీడీపీ నుండి నాయకులను దిగుమతి చేసుకుని వారికే టికెట్ లు కేటాయిస్తూ తన రాజకీయ బానిసత్వన్ని బయట ప్రపంచానికి తెలియజేసారు .
ఈ మాత్రం దానికి పొత్తు , పోటి అంటూ మాటలు దేనికి 2014 మాదిరే పోటికి దూరంగా వుండి టీడీపీ,బిజెపి అభ్యర్దులకు ప్రచారం చేస్తే సరిపోయేది అంటున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు . ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు జనసేన పార్టీ ని టీడీపీకి తోక పార్టీగా, పార్టీ కార్యకర్తలను జెండా కూలీలు అంటూంటే ఈరోజు పవన్ కళ్యాణ్ తన చేష్ఠలతో జనసేన పార్టీ ని నిజంగానే టీడీపీ తోక పార్టీ గా , జనసేన కార్యకర్తలను జెండా కూలీలుగా మార్చేసాడు అని అవేదన చెందుతున్నారు . పవన్ తీరుతో విసుగు చెందిన కార్యకర్తలు మేము పవన్ కళ్యాణ్ మాదిరి విలువలు వదిలేసి, ఒకరికి బానిసలుగా జెండా కూలీలుగా జనసేన పార్టీ లో కొనసాగలేము అంటూ పార్టీకి రాజీనామాలు చేసి బయటకు వెళ్తున్నారు. ఇది చూస్తుంటే జనసేన పార్టీ లో రానున్న రోజుల్లో కార్యకర్తలు మిగిలేలా లేరు .