Nellore : నెల్లూరు సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుంటారో తేలింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విధంగా కొత్త వ్యక్తి తెరపైకి(Nellore) వచ్చాడు. ఇక్కడున్న డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ను నరసారావుపేట పార్లమెంట్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపారు. దీంతో సిటీకి చాలామంది పేర్లు వినిపించారు. తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి, విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణ బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే అనూహ్య రీతిలో జగన్ ముస్లింలకు ఈ స్థానాన్ని కేటాయించారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఉన్న ఎండీ ఖలీల్ ఇకనుంచి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఆయన, అనిల్ శనివారం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఖలీల్ ప్రస్తుతం 43వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. 2013లోనూ విజయం సాధించారు. ఈయనిది జెండా వీధి. మహ్మద్గౌస్, మహ్మద్ జుబేదాబేగం దంపతుల ఏడుగురి సంతానంలో చివరి వ్యక్తి. కొంతకాలం డీవైఎఫ్ఐలో పనిచేశారు. తర్వాత సీపీఎంలో ఉన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఆయన అభిమానిగా మారారు. రాజన్న మరణానంతరం జగన్ వెంట నడిచారు. అనిల్తో రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2021లో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత అనిల్ ఇతనికి డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించారు. ఇప్పుడు సిటీ సమన్వయకర్త పదవి దక్కింది. దీంతో జిల్లాలోని ముస్లిం ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ లాగే జగన్ తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది.
సింహపురికి ఎంతో చరిత్ర ఉంది. మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, ఐక్య ఆంధ్రాలో రాజకీయ ఉద్ధండులు ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వారిలో సర్ణ వేమయ్య, ఖండవల్లి కృష్ణారావు, ఆనం చెంచుసుబ్బారెడ్డి, గంగ చిన కొండయ్య, ఎంఆర్ అన్నదాత, ఆనం వెంకటరెడ్డి, కూనం వెంకటసుబ్బారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, జక్కా కోదండరామిరెడ్డి, తాళ్లపాక రమేష్రెడ్డి తదితరులున్నారు.
2008లో సిటీ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి, 2014, 19లో అనిల్ గెలుపొందారు. విద్యాసంస్థలు, ఆస్పత్రులకు కూడలి నెల్లూరు. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈ జిల్లా కేంద్రంలో చేరి చక్రం తిప్పాలని అనేకమంది ఆశ పడుతుంటారు. అయితే అవకాశం కొందరికే దక్కుతుంది. నారాయణ వందల కోట్ల రూపాయలు గుమ్మరించి నెల్లూరు సిటీలో 2019లో పోటీ చేసినా విజయం దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ధన బలాన్ని ఉపయోగిస్తున్నారు. అతనికి ప్రత్యర్థిగా అతి సామాన్యుడిని జగన్ నిలబెట్టారు. నెల్లూరులో ముస్లిం జనాభా అధికంగా ఉన్నారు. తెలుగుదేశం వారిని ఓటు బ్యాంక్గానే చూసింది తప్ప ఎప్పుడూ పదవులు ఇవ్వలేదు. గతంలో అబ్దుల్ అజీజ్ను మేయర్ చేసింది కూడా వైఎస్సార్సీపీనే. అయితే అతను టీడీపీలో చేరిపోయాడు.
నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. అనిల్ ప్రతి వార్డులో నాయకులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యువత జగన్, అనిల్ను అమితంగా ఆదరిస్తున్నారు. ఇవి ఖలీల్కు కలిసొచ్చే అంశాలే. పైగా స్థానికంగా ఉండే వ్యక్తి. నారాయణ టీడీపీ నాయకులే అందుబాటులో ఉండడు. మొత్తంగా చూస్తే సిటీలో పోటీ టీడీపీ పెత్తందారు, వైఎస్సార్సీపీ సామాన్యుడి మధ్యే ఉంటుంది.
– వీకే..