మాట్లిడితే వైసీపీ నాయకులకు బూతులు తప్ప మరేమీ రావనీ, ప్రతిపక్షాన్ని ఎంత బూతులతో తిడితే అంతగా జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటారని పదే పదే టీవీలలో ఏడుస్తూ, కళ్ళొత్తుకునే టీడీపీ నాయకులకి వాళ్ళు అధినేత బూతులు మాట్లాడే పైకొచ్చిన మనిషికి టికెట్ ఇచ్చినపుడు మాత్రం కళ్ళకి అడ్డంగా పచ్చ కొవ్వు పేరుకిపోయి ఏమీ కనబడనట్టు నటిస్తారు.
సరిపల్లి రాజెష్ అలియాస్ మహాసేన రాజేష్ అనే వ్యక్తికి ఏ అర్హత చూసి చంద్రబాబు టికెట్ ఇచ్చారు ??
బూతులు తిట్టడమే అతని అర్హతా?? పార్టీలు మారడమే అతని నిబద్ధతా?? ఏమో మరి అలానే సరిపెట్టుకొనవలసి వస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అనుకూలంగా మాట్లాడుతూ, టీవీ డిబేట్లలో పాల్గొన్న మహాసేన రాజేష్, తరువాత వైసీపీ పట్టించుకోకపోవడంతో… ఆ పార్టీనే కొన్నాళ్ళు విమర్శిస్తూ వచ్చారు.
ఇలానే, అంతకుముందు కూడా టీడీపీని, పవన్ కళ్యాణ్నీ, జనసేననీ తీవ్రంగా విమర్శించి, అత్యంత అసభ్య పదజాలంతో విమర్శించిన మహాసేన రాజేష్, ఆ తర్వాత అదే విధంగా వైసీపీనీ విమర్శిస్తూ వచ్చాడు. పవన్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడనీ, ప్యాకేజీ స్టారనీ, టీడీపీది పెత్తందారీ పధ్ధతి అనీ, బాబు పద్ధతి అలా ఇలా ఉంటుంందనీ… ఇలా ఒకటి కాదు. నోటితో చెప్పలేని బూతులను అలవోకగా పలుకుతూ, యూట్యూబు వీడియోల్లో చెలరేగిపోయి విమర్శలు చేసాడు. ఇప్పుడు మరి ఏమయిందో సడెన్గా బాబు, పవన్ మంచి వాళ్ళయిపోయారు. వాళ్ళు పంచిన చేరి చిలుక నవ్వులు నవ్వుతున్నారు.
ఆ తర్వాత కొంత కాలానికి జనసేనలో చేరతాననీ, జనసేన అధినేత తనకు ఫోన్ చేశారనీ, నన్ను… నావంటి దళితుడిని పట్టుకుని రాజేష్ గారూ అంటూ సంభోధించారనీ, నా దేవుడు పవనే అని చెప్పిన రాజేష్ ఎవరూ ఊహించని విధంగా మరుసటి రోజే టీడీపీలో చేరాడు.
టీడీపీలో చేరి, యువగళంలో పెట్టిన సభలతో లోకేష్కు దగ్గరయ్యేలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు. అలా కొన్ని సభలకూ, సమావేశాలకూ నాయకత్వం వహించాడు. చినబాబు కి బాగా కావాల్సిన మనిషయిపోయాడు.
టిడిపి జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థులు ప్రకటించినప్పుడు ఎవరూ ఊహించని విధంగా మహాసేన రాజేష్కు టికెట్ దక్కింది. అర్హత ఏంటీ అనేది ఎవరికీ తెలియదు. అయితే టికెట్ దక్కడం వెనుక లోకేష్ కారణం అని మాత్రం టీడీపీలో పలువురు చర్చించుకుంటున్నారు. కేవలం బూతులే ప్రాతిపాదికంగా, అసభ్య పదజాలమే అర్హతగా లోకేషే పిలిచి రాజేష్కు టికెట్ ఇప్పించ్చాడని పలువురి ఉవాచ.
యువగళం ప్రారంభం నుంచి ఇదే విధంగా అసభ్యంగా తిడుతూ వస్తున్న లోకేష్కు కూడా రాజేష్ వాడే అసభ్య పదాలు బాగా నచ్చాయనీ, అందుకే టికెట్ దక్కిందని అంటున్నారు. అయితే అతనికి టికెట్ ప్రకటించడంతో, అటు టీడీపీ, ఇటు జనసేన రెండు పార్టీలులోను కలకలం చెలరేగింది.