చెరుకు రైతులను ఆదుకోవడం అంటే రైతులు పండించిన చెరుకు గడలు మొత్తం తినాలేమో అనుకోని, ఆవిధంగా హామీ ఇస్తున్నాడా ఏంటి లోకేష్.. ? .
2000 సంవత్సరంలో రాష్ట్రాన్ని ఒకవైపు కరువు నాశనం చేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులను ప్రజలను కరెంటు చార్జీలు పెంచి నాశనం చేశాడు. ఆంధ్రరాష్ట్రంలో రాజుగా బ్రతుకుతున్న రైతు పక్క రాష్ట్రాలలో వలసకూలీ అయ్యేలా చేసింది చంద్రబాబు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినాక విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి కూడా రైతులకు ఏవిధంగానూ సహాయం చెయ్యలేదు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించిలేదు. 2014 ఎన్నికల హామీల్లో రైతురుణమాఫీ చేస్తామన్నారు.. అది జరిగిన దాఖలాలు లేవు.. 2018 లో అయితే రైతులకు కనీస మద్ధతు ధర ప్రకటించకపోవడంతో చిత్తూరు జిల్లాలో టమాట రైతులు, మామిడి రైతులు రోడ్ల మీద పంటను పారబోసారు.
రైతులను నాశనం చేసిన చంద్రబాబు మాటలు నమ్మేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్దంగా లేరని తెలుసుకున్న టీడీపీ.. లోకేష్ ను పాదయాత్ర అంటూ రోడ్డు మీద వదిలేసింది. ఈ లోకేష్ కు ముందు వెనక.. గతం వర్తమానం ఏదీ తెలియదు.. నోటికొచ్చిన మాటలు, తలకెక్కని లెక్కలు మాట్లాడతాడు. అందుకే చెరుకు రైతులను ఆదుకుంటాం అంటూ హామీ ఇచ్చాడు.. అసలు విషయం ఏంటంటే వాళ్ళ నాన్న రైతులకిచ్చిన హామీ నెరవేర్చడం అంటే గగనం..
చక్కెర రైతులకు చంద్రబాబుకు చాలా పెద్ద గతం దాగివుంది. రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలకు ఉరేసిందే చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల కారణంగా అనేక షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
చంద్రబాబు చక్కెర రైతులను, షుగర్ ఫ్యాక్టరీలను మోసం చేయడం ఎప్పటినుండో జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఘగర్ ఫ్యాక్టరీ అయిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ 2001లో బ్రహ్మాండంగా నడుస్తున్నప్పటికీ ఫ్యాక్టరీ దివాలా తీస్తుందంటూ పుకార్లు పుట్టించిన చంద్రబాబు ప్రైవేటైజేషన్ పేరుతో డెక్కన్ పేపర్ మిల్స్ అనే సంస్థకు ఇచ్చేసారు. 600 కోట్ల విలువైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని, 15 వేల ఎకరాలని, 5 వేల మంది కార్మికులని డెక్కన్ పేపర్ మిల్స్ అనే సంస్థకు యూనిట్ రూ.20 కోట్ల రూపాయలుగా రూ. 600 కోట్ల విలువ గల మూడు నిజాం షుగర్ ఫ్యాక్టరీలను టెండర్ లేకుండా రూ. 65.40 కోట్లకే అమ్మేశారు.
అంతేకాదు.. 2000 సంవత్సరంలో మెట్పల్లి, శక్కర్నగర్, మంభోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీలను ఎలాంటి టెండర్లు లేకుండానే టీడీపీ ప్రభుత్వం గోల్డ్స్టోన్ కంపెనీకి రూ.65.40 కోట్లకే కట్టబెట్టింది. ఈ విషయంలో అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఫరేఖ్ విభేదించినప్పటికీ ఆయన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ఫ్యాక్టరీలను అమ్మేశారని ‘‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్’’ అనే పుస్తకంలో రాసారు.
అప్పట్లో లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో 2003–04లో వాటిని మూతపడేటట్టు చేశారు. వేలాది రైతులు, కార్మికులు రోడ్డున పడ్డారు. చివరకు వారికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా చంద్రబాబు బకాయి పెట్టారు.
వైఎస్సార్ ప్రభుత్వం మినహా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేశాయి. ఫ్యాక్టరీలు మూతపడటం, ప్రభుత్వాల ప్రోత్సాహం కరువవడంతో చెరకు రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రంలో ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరకు ప్రస్తుతం 35 వేల హెక్టార్లకు పడిపోయింది. సహకార, ప్రైవేటు కర్మాగారాల ద్వారా ఒకప్పుడు కోటి టన్నులకు పైగా క్రషింగ్ జరగ్గా, ప్రస్తుతం 23 లక్షల టన్నులకు పరిమితమైంది.
చంద్రబాబు ప్రభుత్వం చక్కెర రైతులకు ఎగ్గొట్టిన రూ.167.60 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 108 కోట్లలో రూ.14 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఏజే సుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి పడిపోయాయి. ఇదంతా బాబు నిర్వాకం వల్లనే అన్నది సుస్పష్టం.
బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వందల కోట్లు ఖర్చు పెట్టి వీటిని ఆధునికీకరించినా క్రషింగ్ చేసేందుకు ముడిసరుకైన చెరుకు దొరికే పరిస్థితి లేదు. సామర్థ్యానికి సరిపడా చెరకు లేక క్రషింగ్ నిలిచిన కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చడం ద్వారా రైతులకు మేలు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి కలిగించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం.
గతం తెలియని వర్తమానం అర్ధం చేసుకోలేని లోకేష్ కొత్తగా చక్కెర రైతులను ఆదుకుంటామంటూ హామీలిస్తున్నాడు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చక్కెర రైతులకు వారే అన్యాయం చేసారు, మళ్ళీ వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులను ఆదుకున్నాక ఇప్పుడు వచ్చి ఎవర్ని ఉద్దరిస్తామని చెబుతున్నారో వారికే తెలియాలి.