ఏపీలో రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు టీడీపీ పడుతున్న పాట్లు చూస్తుంటే 41 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోయిందో అర్ధమవుతుంది. ఇప్పటికే సొంత క్యాడర్, ప్రజలపై పూర్తిగా నమ్మకం వదులుకున్న చంద్రబాబు ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ ని, మరో పక్క తిట్టిన బీజేపీని సైతం మోయడానికి సిద్దమైపోయినట్టు సంకేతాలు పంపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని భార్య భువనేశ్వరీ సైతం నిజం గెలవాలి పేరున యాత్రలు ప్రారంభించారు. ఇప్పుడు కోడలు నారా బ్రాహ్మిణి కూడా రంగంలోకి దిగినట్టు కనిపిస్తుంది.
నారా లోకేష్ 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా ఘోరంగా దెబ్బతిన్న మంగళగిరి నియోజకవర్గంపైనే నారా బ్రహ్మణి కూడా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ నియోజకవర్గంలో సంఖ్యా పరంగా చేనేత వర్గం ఎక్కువగా ఉండటం వైసీపీ కూడా ఆ వర్గానికే టికెట్ కేటాయించడంతో మళ్ళీ లోకేష్ ఓటమి ఖాయమని సర్వేలు వస్తున్న వేళ ఆయన సతీమణి బ్రహ్మణీ ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకొందట.
ఈ నేపధ్యంలోనే సరిగ్గ ఎన్నికల ముందు మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన వీవర్ శాలను నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళగిరి చేనేత కార్మికులకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని, చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంకా బ్రాహ్మణి మాట్లాడుతూ మంగళగిరి పేరు చెబితే చేనేత చీరలు గుర్తొస్తాయని, ఇక్కడికి వస్తే సొంత ఊరుకు వచ్చిన భావన కలుగుతుందని అన్నారు. చేనేత వృత్తికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు తమవంతు కృషి చేస్తానని భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.
అయితే ఎన్నికల ముందు ఓట్ల కోసమే నారా బ్రాహ్మణికి చేనేతలపై ప్రేమ కలిగిందని. అమె మంగళగిరికి రావడం చేనేతలపై ఉన్న ప్రేమ కాదని భర్త లోకేష్ ని వెంటాడుతున్న ఓటమి భయమే కారణమని మంగళగిరి ప్రజల నుండి వినిపిస్తున్న మాట . ఆమెకి నిజంగా చేనేతలపై ప్రేమే ఉంటే 2014లో చంద్రబాబు ఎన్నికల ముంది మానిఫెస్టోలో పెట్టి చేనేతలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చకుండా పూర్తిగా మోసం చేసిన రోజే అమె మాట్లాడి ఉండేదని నాడు మాట్లాడకుండా ఇప్పుడు చేనేతలపై ప్రేమను చూపిస్తునట్టు మాట్లాడితే నమ్మడానికి తామెవ్వరం సిద్దంగా లేమని ఆ వర్గం నుండి వినిపిస్తున్న మాట. 2014 ఎన్నికల ముందు కూడా ఇలాగే ప్రచారానికి వచ్చిన బ్రాహ్మణి చేనేత పదార్ధాలకు గుర్తింపు తెస్తామని నవ్వుల పాలయ్యారు తప్ప నిజంగానే చేనేత సమస్యలు ఆమెకేం తెలుసంటూ పలువురు వ్యాఖ్యణించడం గమనార్హం . ఇలాంటి ఎన్నికల స్టంట్స్ తో ప్రజలని మోసం చేయలేరని తెలుగుదేశం ఎప్పటికి గ్రహిస్తుందో .