జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సభలో ప్రజలతో ఓ మాట చెప్తుంటాడు.. మా తండ్రి మీ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైయస్సార్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను ఇంకో పది అడుగులు ముందుకు వేస్తా. మా తండ్రి గారిలా ప్రజల గుండెల్లో మిగిలిపోవడమే నా కోరిక.. అని…. తండ్రి ఆశయాలను, తండ్రి లెగసీ ని ముందుకు తీసుకెళ్లడం ఖచ్చితంగా కొడుకు భాధ్యతే… అలాగే…
తెలుగు రాజకీయాలను బ్రష్టుపట్టించింది చంద్రబాబు అయితే ఆయన కొడుకుగా లోకేష్ ఆ బ్రష్టత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నాడు లోకేష్. రాజకీయాల్లోకి ఆడవారిని లాగి వారి పరువును భంగం కలిగించే సంస్కృతి బాబుది అయితే లోకేష్ దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. సోషల్ మీడియా ను వాడి ప్రత్యర్థుల మీద నీచమైన ట్రోలింగ్స్ కు దిగడం, ఆడవారిని లాగి మార్ఫ్ లతో, లేకి కూతలతో ట్రోలింగ్ కు దగ్గరుండి ప్రోత్సాహం ఇస్తాడు లోకేష్. ఐటీడీపీ పేరుతో ఓ సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసి తమ ప్రత్యర్థుల ఇళ్లలో ఆడవారే లక్ష్యంగా పోస్ట్ లు పెట్టించే లోకేష్ అంతటితో ఆగకుండా రాజకీయాల్తో సంబంధం లేని ఆడవారిని కూడా ట్రోల్ చేయించి వారి పరువు, మర్యాదలకు భంగం వాటిల్లేలా ఆఖరికి వారి చావుకు కూడా కారణం అవుతున్నాడు….
మొన్నటికి మొన్న గీతాంజలి ఎపిసోడ్ మరిచిపోకముందే మరో వికృతానికి తెరతీశాడు లోకేష్. ఇంటి పట్టా వచ్చిందని తన ఆనందాన్ని వ్యక్తపరచినందుకు, వెంటాడి వెంటాడి ట్రోల్ చేసి, మనిషి అనేవాడు వాడని పదాల్తో దాడి చేయించి ఆ గృహిణి ఆత్మహత్యకు కారణం అయిన ఉదంతం మరువక ముందే, యాంకర్ లాస్య పై కూడా నీచమైన ట్రోలింగ్ కు దిగింది లోకేష్ స్పాన్సర్ చేసే సోషల్ మీడియా..
వివరాల్లోకి వెళితే, ఉద్దానం లో జగన్ సీఎం అయ్యాక సురక్షిత తాగునీరు అందించిన విధానం, హాస్పిటల్ కట్టి వైద్యం చేయిస్తున్న తీరు, కిడ్నీ వ్యాధి బాదితులకు నెలకు పదివేలు ఇచ్చే సాయం గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియో రూపం లో నిజానిజాలు వెలికితీసేందుకు లాస్య అనే టీవీ యాంకర్ చేసిన ప్రయత్నాన్ని ప్రజలు అందరూ చూడగా, ఉద్దానం ప్రజల కష్టాలను సీఎం జగన్ ఏ విధంగా అర్థం చేసుకుని, ఆ సమస్య పరిష్కారానికి ఆయన చేపట్టిన పనులన్నీ కళ్లకు కట్టినట్టు చూపెట్టడమే ఆ యాంకర్ చేసిన పాపం అయింది లోకేష్ కి. జగన్ కు కాస్త ఫేవర్ గా ఎవరు మాట్లాడినా వాళ్లని శత్రువులు గా భావించే లోకేష్ వారిపై తీవ్రమైన పగను పెంచుకుంటాడు. ఇక యాంకర్ లాస్య పై కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X పేజ్ ల ద్వారా పెయిడ్ పోస్ట్ లతో విరుచుకు పడేలా చేస్తున్నాడు. అచ్చం ఇలాగే గీతాంజలి పై కూడా ట్రోలింగ్ కు దిగి ఆ మహిళ ఆత్మహత్యకు కారణం అయ్యాడు. అయినా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా, నన్నెవరూ ఏం చేయలేరు, నేనింతే అంటూ రోజు రోజుకు తను మనిషిని అనే విషయాన్ని మరచి వికృతంగా ప్రవర్తిస్తున్నాడు…
రాజకీయాల్లో లోకేష్ ఒక విషపురుగు. ఎంత త్వరగా ఆ పురుగును చిదిమేస్తే అంత త్వరగా ఏపి రాజకీయాలు బాగుపడతాయి…