2024 ఎన్నికలకు రెండు నెలల సమయం కూడా లేదు, అధికార వైసీపీలోకి వలసలు ఊపుందుకున్నాయి.ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీజెపీ టీడీపీ జనసేన పార్టీల నుంచి కీలక నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర క్యూ కట్టారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) ఉన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయనను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విశాఖపట్నంకు చెందిన సీనియర్ నాయకులు జి.వి.రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు )వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్, విశాఖ నార్త్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కే.కే. రాజు పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయనను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో రాజంపేట టీడీపీ ఎంపీ ఇంఛార్జి గంటా నరహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . కండువా కప్పి ఆయనను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి (పాయకరావుపేట) బత్తిన రాము – జనసేన విజయవాడ ఈస్ట్ ఇంఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జైభారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏలూరు జిల్లా గొరుముచ్చి గోపాల్ యాదవ్ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు గొరుముచ్చి గోపాల్ యాదవ్. నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో ఏలూరు జిల్లాలో టికెట్ ఆశ చూపించి ఖర్చు పెట్టించారు. ఇటీవల జరిగిన నారా లోకేష్ శంఖారావం సభలో కూడా ఏలూరు ఎంపీ టికెట్ నీదే అంటూ హామీ ఇచ్చాడు, తీర చూస్తే కడప జిల్లాకు చెందిన మహేష్ యాదవ్ కు సీట్ ప్రకటించారు. ఏలూరు మాజీ ఎంపీ మాగుంట బాబు కూడా రెండు రోజుల్లో వైసీపీ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పుత్త మహేష్ యాదవ్ కు సీట్ కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో తణుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్ పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.సీఎం జగన్ సమక్షంలో ఎన్టీయార్ జిల్లా విజయవాడ తూర్పు నియోజక వర్గానికి చెందిన జనసేన కీలక నేత బత్తిన రాము జాయిన్ అయ్యారు. 2019 లో జనసేన తరుపున పోటీ చేసిన బత్తిన రవికుమార్ కు 30,000 ఓట్లు పడ్డాయి.
ఇలా ఎన్నికల సమీపిస్తున్న సమయంలో టీడీపీ, జనసేన ఇతర పార్టీల నుంచి కీలక నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీ లో జాయిన్ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరిన వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.