ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. నెల్లూరు జిల్లాలో శనివారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. చింతారెడ్డిపాళెం నుంచి మొదలైన యాత్ర కావలి నియోజకవర్గంలోని ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంది. ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ భోజన విరామం కోసం ఆగారు. ఆ సమయంలో అమలాపురం నియోజకవర్గానికి జనసేన నేతలు ఆయన్ను కలవగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జనసేన అమలాపురం ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీనుబాబు, ఎస్సీ డివిజన్ రాష్ట్ర నాయకుడు ఎం.శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు, జనసేన వీర మహిళా విభాగం నాయకురాలు చెట్టి సుభాషిణి, జనసేన అమలాపురం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కె.చినబాబు, ఇంకా వివిధ విభాగాలకు చెందిన నాయకులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక ఆ పార్టీని వీడుతున్న వారు నానాటికి పెరుగుతున్నారు. ఎన్నికల్లో తక్కువ సీట్లకు పరిమితం కావడం, చంద్రబాబు నాయుడికి దాసోహమైపోవడం, తెలుగుదేశం నేతలు చిన్నచూపు చూడడం తదితర కారణాలతో సేన నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇంకా జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు జై కొడుతున్నారు. అదే విధంగా ఆయన వద్ద మాత్రమే గౌరవం దక్కుతుందని భావిస్తున్నారు. చేరికలతో వైఎస్సార్సీపీ జోష్లో ఉండగా.. సేన నానాటికీ నీరసమైపోతోంది.
వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుభాషిణితోపాటు వివిధ… pic.twitter.com/YXzBV7Ra7B
— YSR Congress Party (@YSRCParty) April 6, 2024