ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ మేమంతా సిద్ధం అనే పేరుతో తలపెట్టిన బస్సు యాత్ర నేడు ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి ప్రారంభమైంది. నేడు ఉదయాన్నే నైట్హాల్ట్ పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్ వైయస్.జగన్ను కలిసిన ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆయనకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ, టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి. బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్ పంచాయితీ మాజీ సర్పంచ్ వీ ఎస్ కృష్ణమూర్తిలు, తమ అనుచరులు పలువురు టీడీపీ కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు, వీరిని పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
ఈ చేరికల తర్వాత జగన్ రాకకోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోలాహలం మద్య ప్రారంభమైన బస్సు యాత్రనెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఇది వైఎస్సార్ కుటుంబం సొంత జిల్లా కావడం, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభలే తప్ప యాత్రల ద్వారా ప్రజలకి చేరువైన సందర్భలు తక్కువగా ఉండటంతో జగన్ ను దగ్గరగా చూసేందుకు ఇదే అదనుగా భావించిన అభిమానులు పోటెత్తడంతో యాత్ర నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా కొంత నెమ్మదిగా సాగుతుంది.