ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన నడుస్తుంది.. పుట్టిన పసిబిడ్డ నుండి వయసైపోయిన పండు ముసలివారి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం భద్రంగా చూసుకుంటుంది. విద్య వైద్యం ఆరోగ్యం అంటూ పేద మధ్యతరగతి ప్రజల ప్రతి అవసరాలను తీరుస్తూ ప్రజలకు తోడుగా నిలుస్తుంది. అయితే వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలన్నింటిలో వైఎస్సార్ పిన్షన్ కానుక పథకం ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. మునుపెన్నడూ లేనివిధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలు చేసే విధానం అనేక రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది.
గత ప్రభుత్వంలో పింఛన్లు ఎలా ఎంతెంత అందించారు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్లు ఎలా అందుతున్నాయనేది ఇప్పుడు చూద్దాం..
2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యేనాటికి పెన్షన్ అందుకునేవారి సంఖ్య 43.11 లక్షలు ఉండగా.. 2019 అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలలు ముందు 39 లక్షలు మంది పెన్షన్ అందుకున్నారు.. అదే 2019 లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 66.34 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. గతంలో టీడీపీ బాబు హయాములో నెలకు పెన్షన్ల కోసం రూ. 507 కోట్లు ఖర్చు చేస్తూ.. ఐదేళ్ళలో పెన్షన్ల కోసం రూ. 27,687 కోట్లు బాబు ఖర్చు చేయగా.. ప్రస్థుతం వైఎస్ జగన్ పాలనలో నెలకు పెన్షన్ కోసం రూ.1,519 కోట్లు ఖర్చు చేస్తూ ఈ నాలుగున్నరేళ్ళలలో పెన్షన్ల కోసం రూ. 83,526 కోట్లను వైఎస్సార్సీపీ ఖర్చుచేసింది. అయితే ఇప్పుడు జనవరి, 2024 లో పెంచి నెలకు ఇస్తున్న పెన్షన్ రూ. 1,968 కోట్లు..
గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏ సంక్షేమ పథకం అందాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు చదివించి వాళ్ళ కాళ్ళా వెల్లాపడితే కానీ పనులు జరిగేవి కాదు.. కానీ ఇప్పుడు నెలలో మొదటి రోజు ఉదయం 6 గంటలలోపే వాలంటీర్ ఇంటికి పెన్షన్ తీసుకెళ్ళి లబ్ధిదారులను నిద్ర లేపి పెన్షన్ వారి చేతికి అందిస్తున్నారు. కులం మతం పార్టీ ప్రాంతం చూడని వైసీపీ ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా పెన్షన్ అందిస్తుంది.
గతంలో పెన్షన్ అర్హతలు ఏంటి.. వైసీపీ హయాంలో పెన్షన్ అందుకునేందుకు అర్హతలు ఏంటంటే..
బాబు హయాంలో వయసు 65 ఏళ్ళు దాటాలి.. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో 60 ఏళ్ళు వయసు దాటితే చాలు.
బాబు హయాములో మాగాణి 2.5ఎకరాల్లోపు మెట్ట 5 ఎకరాల్లోపు ఉండాలి.. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రెండు కలిపి 10 ఎకరాలు లోపు ఉంటే చాలు.
బాబు హయాములో కుటుంబ ఆదాయం గ్రామాల్లో 5 వేల లోపు పట్టణాల్లో 6 వేల లోపు ఉండాలి. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో గ్రామాల్లో 10 వేల లోపు పట్టణాల్లో 12 వేల లోపు ఉండాలి.
2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ పొందేందుకు అర్హులు.. అంటూ అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2014 సెప్టెంబరు 18న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీచేసిన ఆర్సీ నెంబరు 1053 ఆదేశాలే అందుకు సాక్ష్యం. వీటి ప్రకారం.. కేవలం 80 శాతానికి పైగా అంగవైకల్యం ఉండే వారికి మాత్రమే రెండో పెన్షన్ మంజూరు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందే అందరికీ, రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించడంతో పాటు కొత్తగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా కల్పించిన వెసులుబాట్లతో రాష్ట్రంలో 3,53,645 మంది ఒకే ఇంట్లో రెండో పెన్షన్ కూడా పొందుతున్నారు. అవసరంలో ఉండి ప్రభుత్వ చేయూతకై ఎదురుచూసే వారికి జగన్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తూ వస్తుంది. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందకుండా ఎవరూ మిగిలిపోకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధాంతం.