ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ప్రధాన పార్టీలన్నీ మునిగితేలుతున్నాయి. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
భీమవరం నియోజకవర్గం మీద, పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్న సీఎం జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా చాలా బాధగా ఉందన్నా రాజకీయాలు ఇంత దిగజారి పోతాయా అని. ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడు దయ వల్ల మా జగనన్నకు ఏమీ జరగలేదని సంతోషిస్తుంటే దుర్మార్గులు, దుష్టులు, మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. వాళ్లకి, నీ మీద ఎందుకన్న ఇంత ద్వేషం, ఎందుకన్నా నీ మీద అంత కక్ష.
అవ్వాతాతలకు 65 సంవత్సరాలు వస్తే కానీ పెన్షన్ రానివాళ్లకు 60 సంవత్సరాలవాళ్లకే రూ.3 వేల పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారుజామున 5 గంటలకే వాళ్లందరికీ అందిస్తున్నందుకా? భావిభారత పౌరులు మన పిల్లలు బాగా చదువు కోవాలి, వాళ్లకు విద్యను సంపదగా అందించాలి, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు రావాలని ఆలోచన చేస్తున్నందుకా నీ మీద అంత కక్ష?. ప్రతి పేదవాడికి, ప్రతి రైతుకి, ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా తమ కింది నుంచి ఎక్కడో చోట పనిచేసుకుని బతుకుతున్నవాళ్లందరూ కూడా మనం కూడా ఆత్మాభిమానంతో ఆర్ధికంగా పైకి ఎదిగి మనం గర్వంగా సగర్వంగా బతకాలని ఆలోచన చేస్తున్నవారికి మీరు చేయి అందిస్తున్నందుకా మీ మీద క్షక్ష.?
పేదవాళ్ల ఆశలను చిదిమేయాలని చూస్తున్న దుర్మార్గులు, దుష్టులకి మంచి మనస్సుని కలిగించమని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ.. మీరు పదికాలలపాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి వారిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి వాళ్లు సగర్వంగా ఆత్మాభిమానంతో తలెత్తుకుని తిరిగేలా మీరు చేయాలని కోరుకుంటూ ఈ లక్షలాదిమంది ఆశీర్వాదం మీకు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానని తన ప్రసంగం ముగించారు.