ఐపీఎల్ 2024 సూపర్ సండే లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మునుపటి మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ పై భారీ స్కోర్ చేసి అభిమానులను అలరించిన సన్ రైజర్స్, ఈసారి ఆ స్థాయిలో ఆడలేకపోయి నిరాశపరిచింది
అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ చెరో 29 పరుగులు చేసి, టాప్ స్కోరర్లుగా నిలిచారు. క్లాసెన్ అనుకున్న తీరులో రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. మార్కరమ్ (17) సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టాడు కాగా గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మకు మూడు వికెట్లు దక్కాయి. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కి మంచి ఆరంభం లభించింది వృధ్దిమాన్ సాహా 25 పరుగులు , శుభమాన్ గిల్ 36 పరుగులతో గెలుపుకి పునాది వేసారు, వీళ్ల తరువాత వచ్చిన బ్యాటర్లు సాయి సుదర్శన్ , డేవిడ్ మిల్లర్లు కూడా రాణించడంతో గుజరాత్ సునాయాసంగా గెలుపు సాధించింది
సాయి సుదర్శన్ 36 బంతుల్లో 45 పరుగులు , డేవిడ్ మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు సాధించారు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మాయాంక్ , కమ్మిన్స్ , సాబాజ్ హమ్మద్ తలో వికెట్ తీసారు
హైదరాబాద్ బ్యాటర్లను కట్టిడి చేసి మూడు వికెట్లు తీసిన మోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది