2019 ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ మరియు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పై ప్రతిపక్షాలు దాడి ఏకధాటిగా సాగుతూనే ఉంది. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ వాలంటీర్లపై టీడీపీ దాని అనుబంధం విభాగాలు ఎల్లో మీడియా చేస్తున్న వికృతి దాడి మాటల్లో చెప్పలేము. దాని ఫలితమే గత 58 నెలలుగా వాలంటీర్ల ద్వారా ప్రశాంతంగా జరుగుతున్న
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది.
వైయస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించిన సీఎం జగన్ అనంతరం నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మీదుగా ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు.
దర్శి నియోజకవర్గంలోని పొదిలి వెంకటాచలంపల్లిలో పింఛన్దారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పింఛన్ల పంపిణీని ప్రస్తావించారు. పింఛన్ కోసం అవ్వాతాతలు ఎన్నో అష్టకష్టాలు పడాల్సి వచ్చేదని, అప్పట్లో వారంతా పింఛన్ తీసుకోవడానికి ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు. మన ప్రభుత్వం వచ్చాక పింఛన్ ఇచ్చే విధానం ఎలా ఉంది అని పింఛన్ దార్లను అడిగారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు వరకు కూడా 1,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచామని అన్నారు. అప్పట్లో చంద్రబాబు 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే తాము వచ్చిన తరువాత ఈ అయిదు సంవత్సరాల కాలంలో 65 లక్షల మందికి పింఛన్ ఇచ్చాము అని తెలిపారు. మన ప్రభుత్వంలో పింఛన్ పొందే లబ్దిదారుల సంఖ్యను రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
కులం, మతం, ప్రాంతం అనే కాకుండా పార్టీలు కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తున్నామని, ఈ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించే ప్రతిపాదనలపైనే తొలి సంతకం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.