చేసిందే వెదవ పని.. మళ్లీ దానికి సమర్థింపులు.. ఇలా సాగుతోంది ఎల్లో మీడియా.. వలంటీర్లపై కక్ష కట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారిని పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి దూరం చేశారు. ఇందుకోసం తన జేబులోని మనిషి నిమ్మగడ్డ రమేష్ను వాడుకున్నారు. ప్రతి నెలా పెన్షన్లు తెచ్చిచ్చే సేవా సైన్యం ఈసారి ఇవ్వరని తెలుసుకున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచాన ఉన్న వారు టీడీపీ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిని కవర్ చేయడానికి పచ్చ మీడియా నానా తంటాలు పడుతోంది.
నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్లే పింఛన్లు అందజేస్తున్నారు. టీడీపీ కుట్రలు చేయడంతో ఎన్నికల కమిషన్ తలొగ్గి వారి ద్వారా పింఛన్లు, ఇతర పథకాల పంపిణీని ఆపేయాలని ఆదేశించింది. దాదాపు అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉంది. అయినా సిబ్బందిని పెట్టి నగదు పంపిణీ చేసేందుకు సర్కారు వేగంగా చర్యలు తీసుకుంది. ఈలోగా ఎల్లో మీడియా వక్రభాష్యాలకు దిగింది.
వలంటీర్లను పక్కన పెట్టించిందే కాకుండా.. ఖాజానా ఖాళీ చేశారని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు ఎల్లో డిబేట్లలో చర్చలు నడుపుతున్నారు. మహాటీవీ వంశీ ఒకడుగు ముందుకేసి జన్మభూమి కమిటీలకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగింవచ్చు కదా అనే ధోరణిలో మాట్లాడారు. అసలు ఈ విషయంలో ప్రతిపక్షానికి సంబంధం లేదు. పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికి, సీఎస్కు చేతకాకపోతే ఆ డబ్బును తెలుగుదేశానికి ఇచ్చేస్తే ఆ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి పంచేస్తారు. ప్రభుత్వానికి బాధగా ఉంటే టీడీపీకి ఇవ్వాలని వంశీ చెప్పుకొచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగుదేశం కార్యకర్తలే 2014 – 19 వరకు జన్మభూమి కమిటీ సభ్యులుగా పనిచేశారు. పింఛన్ల విషయంలో వాళ్లు చేసిన అరాచకాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అవినీతి లేకుండా.. పక్కాగా ప్రతినెలా ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే అవ్వాతాతలు, దివ్యాంగులు, తదితరులకు పింఛన్ సొమ్ము అందజేసే వలంటీర్లను కాదని జన్మభూమి కమిటీలకు బాధ్యత ఇవ్వాలని ఎల్లో మీడియా చాలా గొప్పగా సూచిస్తోంది. దీనిని బట్టి రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వలంటీర్లను తొలగించడం ఖాయమని, మళ్లీ ఆ దుర్మార్గ కమిటీలు తీసుకొస్తాడని స్పష్టమవుతోంది. ఈ ఎల్లో గ్యాంగ్ పేదల్ని కష్టపెట్టాలని చూస్తూనే ఉంటుంది. ఎంతైనా పెత్తందారులు కదా..