మార్చి నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు స్పీకర్ ముందుకు వచ్చింది. అధికార పార్టీ వైకాపా నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. వైకాపా ను అనుసరించి టీడీపీ కూడా తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా అనర్హత వేటు వేయమని కోరింది.
కాగా ఇక్కడ వైకాపా ను వీడిన ఎమ్మెల్యేలందరూ ఈ పాటికే టీడీపీ కండువ వేసుకొని ఆ టీడీపీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ టీడీపీ పార్టీ ఫిరాయించారు అని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా ఎమ్మెల్యే ఎవరు వైకాపా పార్టీ కండువా వేసుకోలేదు, ప్రభుత్వ కార్యక్రమాలలో మాత్రమే పాల్గొంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలు అందరికీ స్పీకర్ కార్యాలయం నోటీసులు అందజేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి స్పీకర్ ముందు హాజరు అవ్వాలని, హాజరు అయ్యి వివరణ ఇవ్వాలని కోరారు.
టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే కరుణం బలరాం, వాసుపల్లి గణేష్, వంశీ లు ముగ్గురు హాజరు కానుండగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి తాను విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యం లో హాజరుకాలేను, ఫిబ్రవరి రెండు తారీకు హాజరు అవుతానని స్పీకర్ కార్యాలానికి తెలిపారు. ఇంకా వైకాపా రెబెల్ ఎమ్మెల్యే లాగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రేశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ నారాయణరెడ్డి ఉన్నారు. వీరిలో మేకపాటి , ఉండవ్లలి అనారోగ్య రీత్యా స్పీకర్ ముందు హాజరుకాలేము అని స్పీకర్ కార్యాలయం కు తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం పరిస్థితి తెలియాల్సి ఉంది.