TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సీట్లను ప్రకటిస్తూ రేస్ లో దూసుకునిపోతుంటే తెలుగుదేశం(TDP), జనసేన కూటమి అభ్యర్ధుల ప్రకటన మాత్రం నత్తనడకన సాగుతుంది. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఏ నియోజక వర్గంలో ఎవరు తమ అభ్యర్ధి అని తెలియక ఆయా పార్టీల క్యాడర్ సైతం అయోమయంలో పడిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక పక్క జనసేన మరో పక్క టీడీపీ నాయకులు తమకంటే తమకే టికెట్ అని కుమ్ములాడుకుంటుంటే.. మరి కొన్ని నియోజక వర్గాల్లో మాత్రం టీడీపీ, జనసేన అధిష్టానం అభ్యర్ధులని నిలబెట్టడానికే నానా తంటాలు పడుతుంది.
నిన్నటి రోజున టీడీపీకి అనుకూలంగా ఉండే ప్రధాన పత్రికలో టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్ధులు వీరే అంటూ వచ్చిన ఫీలర్ తో ఆయా పార్టీ నేతల్లో కలవరం మొదలైంది .. ముఖ్యంగా అనంతపురం , హిందుపురం అభ్యర్ధులు గా చెప్పబడిన తెలుగుదేశం సీనియర్ నాయకులు కాల్వ శ్రీనివాసులు , బీకే పార్ధసారధి తాము ఎంపీలుగా వెళ్ళలేమని తమకి ఎమ్మెల్యే టికెట్లు కావాలని చంద్రబాబుకి తెగేసి చెప్పినట్టు సమాచారం. వారు ఇరువురు సీనియర్ నాయకులు కావడంతో ఇదే తమకి ఆఖరి ఎన్నికలని, ఇప్పుడు ఎంపీలుగా వెళితే ఓటమితో రాజకీయ జీవితం ముగిసిపోతుందని వారు కలవరపడుతునట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే తమకి ఎంపీ సీటు వద్దని టీడీపీ అధీష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం.
అధికార వైసీపీని ఢీ కొట్టలేక టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలు చేస్తున్నా కూడా కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్ధులు దొరకక టీడీపీ పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది అత్యంత అధమస్థాయి అని రాజకీయ విశ్లేషకుల మాట.