పంచాయితీలను పాడు పెట్టిన పాపం జగన్ రెడ్డిది అనే టీడీపీ ఆరోపణల్లో నిజం ఎంత. …
టీడీపీ హయాంలో ఫించన్ల కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి . ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి, నాయకుల సిఫారసులు కావాలి అన్నది జగమెరిగిన సత్యం .
అలా తిరిగిన ప్రజల ముంగిట్లోకే ఇప్పుడు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వమే వస్తుండటం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది.. కానీ టీడీపీ వర్గ మీడియా అదేదో నేరం అన్నట్టు కథనాలు ప్రచురిస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ శునకానందం పొందుతుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరూ మురిసిపోతున్న వేళ మహాత్మాగాంధీ ఒక మాటన్నారు. మన దేశాన్ని మనమే పాలించుకోబోతున్నాం.. మంచిదే కానీ.. మనం గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టు అన్నారు. ఆ తరువాత ఎంతోమంది గొప్పనాయకులు మన దేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువస్తూ గ్రామ, వార్డు సచివాలయ.. వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజల గుమ్మం ముందుకే వచ్చింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ ఏర్పాటు కావాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగానికి 1992లోనే 73వ రాజ్యాంగ సవరణ చేశారు.
కానీ 2019 లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదాకా అది అమలు చేసిన నాయకులు లేరు. లంచాలు లేకుండా.. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగకుండా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల గుమ్మంలోకే వెళ్ళేందుకు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు ఎంతోగానే తోడ్పడుతున్నాయి. తెల్ల రేషన్ కార్డుతో పాటు అన్ని ప్రభుత్వ సర్టిఫికేట్ల రోజుల వ్యవధిలోనే ప్రజలకు అందించేవిధంగా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. రైతులకు, విద్యార్ధులకు.. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ.. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుంటాయి. ఆంధ్రరాష్ట్రంలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయాల వ్యవస్థను అధ్యయనం చేయడమే దీనికి నిదర్శనం. ఈ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్లో ఒక పాఠ్యాంశంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఒక గ్రామంలో నిర్నిత సేవలు 72 గంటల్లో అందించేలా గ్రామ సచివాలయం, రైతులకు ప్రతినిత్యం తోడుండే రైతు భరోసా కేంద్రం, ఓ మహిళా సంరక్షణ పోలీసు, ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందించే విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రం, మెరుగైన విద్యను అందించే ఇంగ్లీష్ మీడియం స్కూలు.. ఇలా ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తూ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
ఇలా గ్రామ స్వరాజ్యాన్ని తేవటమే టీడీపీ దృష్టిలో పాడు పెట్టటం అనుకొంటా