ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పులివెందుల పర్యటనలో మొట్టమొదటగా డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , డాక్టర్ వైఎస్ఆర్ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను ప్రారంభించారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో 501 ఎకరాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని నిర్మించారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుంది. ప్రారంభించిన తర్వాత ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. కాలేజ్ మరియు హాస్పిటల్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను నోట్ చేసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సూచించి అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే వాళ్ల సమస్యలు పరిష్కారానికి యత్నించారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కి వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు వివరించారు.
కాలేజ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని ప్రారంభించారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో బనానా ప్యాక్ హౌస్ ని ప్రభుత్వం నిర్మించింది. పులివెందుల నియోజకవర్గ ప్రాంతంలో అరటి సాగు ఎక్కువగా చేస్తున్న తరుణంలో ఈ బనానా ఇంటిగ్రేటెడ్ రైతులకి ఉపయోగపడుతుంది. ఇక్కడ పండించే అరటిపంట నాణ్యత బట్టి వివిధ దేశాలకు ఎగుమతులకి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాకౌ హౌస్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్యాక్ హౌస్ ఓపెనింగ్ తర్వాత పాత బస్టాండ్ సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహం ఆవిష్కరించారు.
వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ మిని సెక్రటేరియట్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్ లో నియోజకవర్గానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోటు ఉండేలా ఈ కాంప్లెక్స్ ని నిర్మించారు. దీని తర్వాత వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ని ప్రారంభించారు. 39.13 కోట్ల నిర్మాణ వ్యయంతో వైయస్సార్ పార్కుని అభివృద్ధి చేశారు ఇందులో గార్డెన్ నిర్మాణంతోపాటు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు.
ఇదే పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 370 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్ 1 ను ప్రారంభించారు. దీని ద్వారా 2000 మందికి ఉపాధి అవకాశం లభించనుంది. ఆదిత్య బిర్లా ప్లాంట్ కి జగన్ మోహన్ రెడ్డి 2021 డిసెంబర్ ను శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా జరిగింది.