నేడు నాడు
నేడు అధికారంలోకి రాగానే లబ్ధిదారులకి నేరుగా సంక్షేమ ఫలాలను అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు..వివిధ పథకాల ద్వారా అందే సాయాన్ని ఎలాంటి దళారులు, మధ్యవర్తుల అవసరం లేకుండా బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అతి పెద్ద సంస్కరణగా చెప్పొచ్చు.. నాడు నేడు ద్వారా పాఠశాలల ఆధునీకరణ చేపట్టి వాటిని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడం జగన్ దార్శనికతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు నేడు పథకం ద్వారా అత్యాధునిక ఆసుపత్రులుగా తీర్చిదిద్దారు.
నిలువ నీడలేని పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ళు కూడా కట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కింది. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా 18 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి జగన్ కట్టించారు. అంతేకాకుండా మత్స్యకారుల ప్రయోజనార్థం 11 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నారు. ఇలా ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే మరోవైపు పేదలకు సంక్షేమాన్ని పంచుతున్న జగన్ ప్రభుత్వానికి 2024లో సగర్వంగా ఓట్లు అడిగే హక్కుందని చెప్పొచ్చు .
కానీ సొంత మామకు వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పదవి దక్కించుకుని, రైతులపై తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరిపించి రైతు ద్రోహిగా నిలవడంతో పాటు, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుకు దక్కింది. ఆ గతం పక్కన పెడితే 2014మేనిఫెస్టో ద్వారా 650 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా రైతులను, మహిళలను, పేదలను హీనంగా చూసి చివర్లో వంగుని దణ్ణం పెట్టినా కూడా జనాల విశ్వసనీయత పొందలేని చంద్రబాబుకు మళ్ళీ 2024 ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు ఉందా?