ఏపీలో ఇప్పుడు రాజకీయం మొత్తం వలంటీర్ల చుట్టే తిరుగుతుంది. పింఛన్లని అవ్వాతాతలకు, ఇతర లబ్దిదారులకు ప్రతీ గడపకు తీసుకెళ్లే వలంటీర్ల సేవలను ఆపాలని నిమ్మగడ్డ ప్రసాద్, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఎలక్షన్ కమీషన్ కి పిర్యాదు చేయడం వాలంటీర్లను ఈ రెండు నెలలు పింఛన్ల పంపిణి చేయకూడదని ఎన్నికల కమీషన్ ఆదేశాలివ్వడం చకచకా జరిగిపోయాయి. కేవలం సీఎం జగన్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతో వలంటీర్ల సేవలను ఆపేయించిన టీడీపీ అదే ధోరణిలో సీఎం జగన్ ప్రజలకు అందిస్తున్న ఇతర సేవలను కూడా ఆపేయించే ధైర్యం చేస్తారంటారా?
వలంటీర్ల ద్వారా సుమారు 62 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్ 1వ తేదీకే అందుతుంది. కానీ టీడీపీ చేసిన కుట్రపూరిత రాజకీయం వల్ల పింఛన్ల పంపిణీ ఆగింది. ఈ మండే ఎండల్లో బోసి నవ్వుల అవ్వా తాతలు ఇబ్బంది పెట్టేందుకు ఆ టీడీపీ వారికి మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి సీఎం అయినోడికి ప్రజల బాధలు పరిగణలోకి వస్తాయా అసలు.? వాలంటీర్ల సేవల వలన అటు ప్రజలకు మేలు జరుగుతుందని, ఇటు జగన్ కి మంచి పేరొస్తుందని అక్కసుతో వారి సేవలను నిలిపి వేయించిన టీడీపీ వారు అంతే ధైర్యంగా జగన్ అదనంగా ప్రారంభించిన 108 వాహనాలను కూడా నిలిపివేయాలని పిర్యాదు చేస్తారా ? ఆ సాహసం చేయగలరా?
జగన్ కట్టించిన సచివాలయాలు మూసివేయాలని వాటివల్ల ప్రజలకు ఓ పార్టీ చేసిన మంచి గురించి తెలిసే అవకాశం ఉందని ఎన్నికల కమీషన్ కి పిర్యాదు చేయగలరా? జగన్ ప్రారంభించిన మెడికల్ కళాశాలలను, అలాగే నాడు నేడు పథకం వల్ల ప్రభుత్వ విద్యాలయాలు, వైద్య రంగాలలో జగన్ తెచ్చిన మార్పుల వలన జగన్ కి మంచి పేరొస్తుందన్న అక్కసుతో బడులను, ఆసుపత్రులను మూసివేయాలని కూడా నారా చంద్రబాబు, నిమ్మగడ్డ ప్రసాద్, అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తారా ? నిజంగా అలా పిర్యాదు చేస్తే జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పాలన ఎలాంటిదో పూర్తిగా ప్రజలకు తెలిసివస్తుంది. అప్పుడు టీడీపీ కూటమి ఈ ఎల్లోమీడియాతో చేయిస్తున్న అసత్య ఆరోపణలు ప్రజలకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని అడ్డుకునే దుర్మార్గపు ఆలోచనలున్న చంద్రబాబు లాంటి నాయకులకు ప్రజలు మరోసారి గట్టిగానే బుద్ది చెప్పడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనా టీడీపీ వలంటీర్ల విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.