కుప్పం నియోజకవర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది చంద్ర బాబు నాయుడి కంచుకోటని. అలాంటి కంచుకోటలో ప్రస్తుతం బాబుకు ఓటమి భయంతో వణుకు పుడుతోంది. అది ఈరోజు కుప్పంలో చంద్రబాబు సభతో తేటతెల్లం అయింది.
చంద్ర బాబు గత 40 ఏళ్లుగా కుప్పంను సొంత నియోజవర్గంగా చేసుకొని తన రాజకీయాలను రాష్ట్రమంతట చేస్తున్నారు. ఎప్పుడైతే వైఎస్సార్సీపీ పార్టీ పుట్టిందో ఆరోజు నుండి కుప్పంలో బాబుకు ఎదురీత మొదలు అయింది. 2014 లో కొద్దిగా తగ్గిన మెజారిటీ 2019 కు వచ్చేసరికి ముప్పై వేలకు పడిపోయి అందులో ఒక రౌండ్ లో వెనుకబడ్డారు.
ఇక స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలలో కనీస పోటీ ఇవ్వలేక ఓడిపోయారు. కుప్పంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్ లో వైఎస్సార్సీపీ కి వచ్చిన ఓట్లు చూసుకుంటే మొత్తం మీద టీడీపీ పై 20 వేల మెజారిటీ వచ్చింది వైసీపీకి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దొంగ ఓట్ల ఏరివేతలో భాగంగా కుప్పంలో ఇప్పటివరకు వున్న 83 వేల దొంగ ఓట్లలో ఇప్పటివరకు 60 వేలు తొలగించారు. అదే బాబుకు పెద్ద ఎదురు దెబ్బ. గతంలో ఎన్నికలప్పుడు తప్ప విడిగా ఏనాడూ కుప్పం మొఖం చూడని చంద్రబాబు నాయుడు ప్రతి రెండు మూడు నెలల కొకసారి కుప్పం పర్యటన చేస్తూ ఓటమీ భయం తో కార్యకర్తలను రెచ్చగొడుతూ దాడులు చేస్తూ తన అసహయతను బయట పెట్టుకుంటున్నారు.
ఇక 2024 ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత ప్రచారం మొదలు పెట్టిన చంద్ర బాబు నాయుడు ఈరోజు తను పోటి చేసే కుప్పం నియజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ తరువాత జరిగిన ఈ కుప్పం సభ ఎన్నికల ప్రచారంలో టీడీపీకి మొదటి సభ. అందులో బాబు 40 సంవత్సరాలుగా గెలుస్తున్న నియోజకవర్గం అయిన బహిరంగ సభకు పట్టుమని 15 వేల మంది కూడా హాజరు కాలేదు. ఈరోజు కుప్పం సభలో నన్ను చివరి సారి గెలిపియ్యండి ఈ 35 సంవత్సరాలు చెయ్యని పనులు ఈ అయిదు సంవత్సరాల్లో చేస్తా అంటూ తాను కుప్పంకు ఎలాంటి అభివృద్ధీ పనులు చెయ్యలేదు అనే విషయాన్ని బట్టబయలు చేసుకున్నారు బాబు .
అంతటితో ఆగకుండా నేను మీకు మంచి చేశాను నాకు ఓటు వెయ్యండి అంటూ మాట్లాడారు కానీ అసలు ఈ 35 సంవత్సరాల్లో ఇదిగో ఈ నీటి ప్రాజెక్టు కట్టాను, ఈ హాస్పిటల్ కట్టాను, ఈ ప్రభుత్వ స్కూల్స్ తెచ్చాను ఈ రోడ్లు తెచ్చాను, ఈ కంపెనీలు తెచ్చాను అని చెప్పుకోలేక పొయ్యాడు. ఎంత సేపటికీ నేను మీకు చాలా చేశాను మీరు నాకు ఓటు వెయ్యాలి అంతే తప్ప తను చేసిన ఓక పని చెప్పుకోలేదు ఎందు కంటే తాను కుప్పంలో ఒక్క అభివృద్ధి పనీ చెయ్యలేదు. ఈరోజు అదే బాబుకు ఓటమి భయాన్ని చూపిస్తోంది.
అదే టైం లో ప్రత్యర్ధి వైఎస్సార్సీపీ గడప గడపకు తిరుగుతూ తమ పాలనలో కుప్పం కు జరిగిన అభివృద్ది అంటూ చేసినా ప్రతి పనిని వివరిస్తూ కుప్పం కు కృష్ణా నది నీళ్లు తెచ్చిన విషయం, నాడు నేడు స్కూల్స్, విలేజ్ క్లినిక్ లు , రైతూ భరోసా కేంద్రాలు, రోడ్లు చూపించి వాటితో పాటు సంక్షేమం చూపించి మీకు మా ప్రభుత్వము లో మంచి జరిగింది అనుకుంటే నే మాకు ఓటు వెయ్యండి అని అడుగుతూ ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజల మద్దతుతో విజయానికి బాటలు వేసుకుంటున్నారు.
అదే సమయంలో బాబు తాను కుప్పంకు ఏమీ చేశానో చెప్పుకోలేక కేవలం ప్రత్యర్ధి పార్టీ అధినేత జగన్ ను ఏక వచనంతో తిట్టడంతోనే సభ నడిపించారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే బాబు మాటలకు సభకు వచ్చిన ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడం..