అతి చేసే తరహా ప్రచారానికి టీడీపీపెట్టింది పేరు. 2019 ఎన్నికల్లో కూడా రాత్రి వరకూ సాగిన ఓటింగ్ ప్రక్రియని చూసి… “రాష్ట్రం రాక్షసుడి చేతిలోకి వెళ్ళకూడదు అని ప్రజలు రాత్రి వరకూ నిలబడి మరీ ఓట్లేసారు” అంటూ ఆఖరు నిమిషంలో కూడా సెల్ఫ్ జాకీలు వేసుకుని లేపుకున్నారు. తర్వాత తగిలిన దెబ్బ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు జస్ట్ బీజేపీతో పొత్తు ఓకే అయిందో లేదో… అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసినంత కంగారు పడిపోతున్నారు. టీడీపీ అఫిషియవ్ పేజీలో “మరొక 55 రోజుల్లో పోలవరం పూర్తి చేస్తే ప్రభుత్వం వస్తుంది” అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కానీ నిజానికి చూస్తే 2014 లో విభజన తర్వాత, విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ను ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మరీ తన చేతుల్లోకి తీసుకున్నదెవరో కాదు సాక్షాత్తూ చంద్రబాబే. తర్వాత కాలంలో పలు రాజకీయ నాయకులతో పాటు, దేశ ప్రధాని కూడా “పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడు” అని వ్యాఖ్యానించే స్థాయికి పోలవరంలో అడుగడుగునా దోచుకున్నాడు.
ఆఖరుకి, పెట్టించింది ఒకటే గేటయినా… దానిని చూడటానికి ప్రజాధనం ఖర్చు చేయించి, సొంత కార్యకర్తలని బస్సుల్లో పోలవరం యాత్రలు చేయించి అక్కడ చిడతలతో “జయము జయము చంద్రన్నా” అని పాటలు కూడా పాడించుకున్నాడు. దాన్ని అలా ఉంచితే పోలవరంలో అడుగుడుగునా అవినీతి కొనసాగిందే కాకుండా, నాణ్యత లేని నిర్మాణాలతో… పోలవరం ఉనికిని ప్రమాదంలోకి నెట్టాడు చంద్రబాబు.
ప్రధానమైన కాపర్ డ్యాం నిర్మించకుండా, నీటి ప్రవాహాన్ని ఆపకుండా,డయాఫ్రమ్ వాల్ నిర్మించి… డయ ఫ్రమ్ వాల్ ప్రవాహం వల్ల దెబ్బతినేలా చేసి కాంట్రాక్టరులదే తప్పంటూ వారి మీదికి నెట్టేసాడు. సరైన నిర్మాణ విలువలు పాటించకపోవడం వల్ల స్పిల్వే వద్ద రోడ్డు కుంగిపోవడం, రహదారులు బీటలు వేయడం వంటివి గతంలో జరిగాయి.
అదిగో ఐపోతుంది ఇదిగో ఐపోతుంది అంటూ ఊరించి ఊరించి అయిదేళ్ళలో పూర్తి చేసింది ఒక్క గేటు.అది కూడా నాసిరకందాయె. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అంతో ఇంతో చేయబట్టి ఈ మాత్రం వరకు అయినా పోలవరం ప్రోజెక్ట్ పూర్తి అయింది అని ఎవరిని అడిగినా చెప్తారు.