అధికారం కోసం అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ విశ్లేషకులు తరుచూ చెప్పే మాట. తన పాపాన్ని సైతం ప్రత్యర్ధులపైకి నెట్టి ప్రత్యర్ధుల మేలు సైతం తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకోగల సమర్ధుడు చంద్రబాబని తెలియని వారు ఉండరు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాలుక ఎన్ని విధాలుగా అసత్యాలు పలుకుతుందో లెక్కించి చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇదే పద్దతిని అవలoబిస్తున్నారు.
తాజగా శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన తెలుగు మహిళల సదస్సులో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత బియ్యం, పప్పు, ఉప్పు, చింతపoడు , నూనె లాంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయని దానికి ప్రధాన కారణం జగనే అని తమకి ఓటు వేస్తే ధరలు తగ్గిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ మహిళలని మోసం చేసే ప్రయత్నం చేశారు. నిజానికి నిత్యవసర ధరలు పెరుగుదలలో వాస్తవం ఉన్నా అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగాయని చెప్పడంలోనే చంద్రబాబు కుట్టిల బుద్ది బయటపడుతుంది.
కరోనా లాంటి మహమ్మారిని ప్రపంచం ఎదుర్కున్న తరువాత ఏర్పడ్డ పరిస్థితుల వలన వస్తువుల ధరల పెరుగుదల అన్ని దేశాల్లో కనిపించిన మాట వాస్తవమే, ఆ దేశాలతో పాటుగా భారత దేశం కూడా ఆ మహమ్మారి ప్రభావం ఎదుర్కుని ధరల పెరుగుదల నుండి తప్పించుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలో మిగిలి ఉన్న 27 రాష్ట్రాల్లో సైతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయనే వాస్తవాన్ని దాచి కేవలం ఓట్ల కోసం అసత్యాలు పలకడం చంద్రబాబుకే సాధ్యమైన నీచ బుద్దని పలువురు నుండి వస్తున్న విమర్శలు.
14ఏళ్ళు అధికారం ఇస్తే మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెలబెట్టుకోలేని చంద్రబాబు, చెప్పిన ప్రతి హామీ చెప్పినట్టుగా చేసి చూపిన జగన్ ని పరిపాలనలో ఎదుర్కోలేకే ఇలా జగన్ కి సంభంధం లేని వాటిని జగన్ కి అంటకడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యంలో చీప్ బ్రాండ్స్ ని చంద్రబాబే తెచ్చి జగన్ పై నెపం మోపడం, కేంద్రం ఆధీనంలో ఉండే ధరల పెరుగుదలను సైతం జగన్ కి అంటకట్టడం లాంటివి చంద్రబాబు చేస్తున్నా గతంలో మాదిరి ఈ రోజుల్లో తన పప్పులు ఉడికే పరిస్థితులు ఇప్పుడు లేవని , మహిళలలో సైతం చైతన్యం వచ్చిందని ఎవరు మాయగాళ్ళో , ఎవరు మేలు చేసే వాళ్ళో తెలుగుకోగలరని విశ్లేషకుల అభిప్రాయం.