ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోటగా ఉండేది. అలాంటిది నేడు ఆ కంచుకోట బీటలై పారింది. 2019 ఎన్నికల వరకు బోయలు కురుబలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే నడిచారు. నేడు ఆ కులాలకు చెందినవారు ఒక్కొక్కరు టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బోయలు కురుబలకి సంబంధించి వారు ఓట్లు మాత్రమే కావాలి వాళ్లకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటివి ఏమాత్రం చేయరు.
ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నాలుగు లక్షల ఓటర్లు ఈ కులాలకు చెందినవారుగా ఉన్నారు. వీళ్ళని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో చక్రం తిప్పింది కానీ ఎన్నికలప్పుడు మాత్రం ఈ రెండు కులాలకు చెందిన నాయకులు ఎవరు గుర్తుకురారు. ఇంతమంది ప్రాతినిధ్యం ఉన్న ఈ కులానికి టిడిపి ఎన్నికలకు ముందు రెండు సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఒక సీట్తో సరిపెట్టేసింది. ఎన్నికలకు ముందు ఇరు కులాలు వారి దగ్గర డబ్బు ఖర్చు పెట్టించడం టికెట్ ఆశ చూపడం టికెట్ ఇవ్వకుండా పోవడం ఇలా గత ఐదు పర్యాయాలుగా జరుగుతూనే ఉంది . కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వీళ్లకి ప్రాతినిధ్యం మృగ్యం అవుతూ వచ్చింది.
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లు దానికి సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదు. నిన్న ఇదే విషయమై ఎన్నికల ప్రచారంలో కళ్యాణదుర్గం అభ్యర్థిని వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తి అడగగా , కళ్యాణ్ దుర్గం టిడిపి అభ్యర్థి సురేంద్ర నాయుడు తన అనుచరులు అడిగిన వ్యక్తిపై దాడికి దిగారు. అలా దాడికి దిగడంతో ఆ ప్రదేశంలో పెను దుమారమే జరిగింది అని చెప్పాలి.
ఇటీవల టీడీపీ పార్టీ కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివ బాల కూడా టిడిపిని పార్టీని వీడారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ తన భర్త చనిపోతే తన సమాధి పైన కూడా టిడిపి కార్యకర్త అని రాయించాం అయినా ఈ పార్టీలో మాకు సరైన గౌరవం దక్కలేదు అని వాపోయారు. ఎన్ని రోజులు బీసీలు పార్టీ అని చెప్పుకుంటూ వచ్చి, నాకు ఎమ్మెల్యే లేదు ఎంపీ సీట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చి డబ్బు లేదని కారణం చేత ఆ సీట్ ని కమ్మ కులస్తులకు కేటాయించడం ఏమాత్రం న్యాయమని కోరారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కురుబలకు ఒక సీటు కేటాయిస్తే, అదే అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి, మంత్రులను చేసి, ఎంపీలను కూడా చేసిందని చెప్పారు. ఈ పార్టీలో ఉంటే మాకు సరైన గౌరవం దక్కదని భావించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, బీసీలకి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చేసిన మోసాన్ని రాష్ట్ర మొత్తం కలియతిరిగి చెప్తానని ఈ సందర్భంగా తెలిపారు.