తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా తలనొప్పిగా మారాడు. చెప్పిన పని సక్రమంగా చేయకుండా పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేశాడని మండిపడుతున్నట్లు తెలిసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసింది ఉమా మనుషులేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం టీడీపీ మెడకు చుట్టుకోవడంతో బాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
సీఎంపై దాడి చేయించాలని ఉమాకు చెప్పించింది చంద్రబాబేనని ప్రచారం ఉంది. అయితే విషయం మొత్తం బయటపడడంతో పార్టీ ఇమేజ్ బాగా దెబ్బతింది. దీంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సెంట్రల్ అభ్యర్థిని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఉమా ఇప్పటికే నామినేషన్ కూడా వేశాడు. అయినా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అతని చేత పోటీ చేయిస్తే దారుణ ఓటమి చవి చూడాల్సి వస్తుందని భయపడి అవకాశం ఉంటే పోటీ చేసేందుకు రెడీ ఉండాలని వంగవీటి రాధాకు చంద్రబాబు సమాచారం పంపారని తెలిసింది. ఆయన సరేనని, కావాల్సిన నగదు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా రాధా మనుషులు ఉమా మంచివాడు కాదని అప్పుడే ప్రచారం కూడా స్టార్ట్ చేశారట.
అరెస్ట్ భయంతో తప్పించుకుపోయిన ఉమా తాజా ప్రెస్మీట్ పెట్టి నోటికొచ్చింది మాట్లాడాడు. దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సైలెంట్గా ఉండాలని చెబితే రచ్చరచ్చ చేస్తున్నావని కోప్పడినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమా భవిష్యషత్ ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ కేసు వ్యవహారాన్ని ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఉమా హ్యాండ్ ఉన్నట్లు స్పష్టం కావడంతో పోటీ చేయడానికి అతనికి చాన్స్ ఇస్తారా? లేదా? అని తెలియాల్సి ఉంది. కాగా చంద్రబాబు తీరుపై ఉమా తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన చెబితేనే దాడి చేయించానని, ఇప్పుడు సపోర్టు చేయకుండా తప్పించుకుంటున్నారని సన్నిహితుల వద్ద వాపోయాడట. రాధాకు సమాచారం ఇచ్చి తన టికెట్కే ఎసరు పెడుతున్నారని, చెప్పినట్లు ఆడి తాను ఇరుక్కుపోయాయని కన్నీరుమున్నీరయ్యాడట. సీఎంపై హత్యాయత్నం చేయించి కట్టు కథలు అల్లిన ఉమా ఇప్పుడు బాబు వెన్నుపోటుకు బలైపోతాడో.. లేక సపోర్టు పొంది నిలబడతాడో.. కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
– వీకే..