నర్సాపురంలో ఏ పార్టీ ఎంపీ సీటు ఎవరికీ ఇస్తారని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో వైసీపీ తమ అభ్యర్థిగా ఉమాబాలను ప్రకటించారు. ఇక కూటమి తరుపున అందరూ ఊహించినట్టుగా రఘురామరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయింపు జరిగింది. ఇప్పుడు అదే నర్సాపురం హాట్ టాపిక్ గా మారుతోంది. నరసాపురం నుండి 2014 లో వైసీపీ నుండి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే కొన్ని కారణాలతో వైసీపీతో విభేదించి టీడీపీ అనుకూల మీడియా సంస్థలతో చేరి సిఎం వైయస్ జగన్ మీద , వైసీపీ ముఖ్య నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో జత కట్టి మొదట టీడీపీ జన సేన పొత్తు కుదుర్చుకునేలా చేసి తరువాత తనకున్న బిజెపి పరిచయాలతో బిజెపి తో కూడా పొత్తు కుదుర్చుకునే లా ప్రయత్నాలు చేశారు.
ఆ తరువాత టీడీపీ, జన సేన కలిసి జెండా సభ అని తాడేపల్లి గూడెంలో పెట్టిన సభలో మాట్లాడుతూ ఇక్కడ నేనే పోటి చేస్త అది ఏ పార్టీ కి టికెట్ వస్తే అ పార్టీ తరుపున అంటూ ప్రకటించారు. తీరా పొత్తుల లెక్కలు తేలి నర్సాపురంలో బిజెపి పోటి చేస్తుంది అని తేలిన తర్వాత బిజెపి నాయకులు 30 సంవత్సరాలుగా బిజెపి లో పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ కు టికెట్ కేటాయించారు. దానితో రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎందుకు టికెట్ ఇవ్వాలేదో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పాలి. నేను వేరే నియోజవర్గంకు వెళ్లను ఇక్కడే నర్సాపురం లోనే పోటీ చేస్తా అని స్టేట్మెంట్లు ఇస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమి చేసైనా సరే తనకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇప్పించాలని బెదిరింపులకు దిగారు. తిరిగి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన రఘురామ కృష్ణంరాజు నేను ఇక్కడే పోటి చేస్తున్న మూడు రోజుల్లో అ నిర్ణయం బయటకు వస్తుంది అంటూ సెలవిచ్చారు.
దీనితో అసలు కూటమి లో ఏమి జరుగుతుంది ఎవరు పోటి చేస్తారు అని ఆసక్తి రాష్ట్ర మంతటా నెలకొంది. ఒకవైపు బిజెపి మా పార్టీలో 30 సంవత్సరాలు పని చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ కు టికెట్ ఇచ్చాము మార్చే ప్రసక్తి లేదు అని చెబుతుంటే రఘురామ కృష్ణంరాజు మాత్రం నేనే పోటీ చేస్తున్న మూడు రోజుల్లో అఫిషియల్ గా ప్రకటిస్తారు అని చెబుతున్నారు.
కూటమి ఈ రకంగా గొడవలూ పడుతుంటే వైసీపీ అభ్యర్థి ఉమబాల ఇప్పటికే ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇప్పటికే అన్ని నియోజవర్గాలు తిరిగి తన పరిచయ కార్యక్రమాలు పూర్తీ చేసుకున్నారు. జగన్ చేసిన సంక్షేమం అభివృద్ది నీ ప్రచారం మొదలు పెట్టారు. కూటమి మాత్రం టికెట్ గొడవలతో సతమత మవూతు అసలు ఏ పార్టీ ఏ అభ్యర్థి పోటి చేస్తారో అని చూస్తూ ప్రచారంను పక్కన పెట్టేశారు.
ఇప్పడు రఘురామ కృష్ణంరాజు కు టికెట్ ఇస్తే భూపతిరాజు శ్రీనివాస వర్మ సపోర్ట్ చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అదే టైంలో భూపతిరాజు శ్రీనివాస వర్మనే అభ్యర్థి అయితే రఘురామ కృష్ణంరాజు సపోర్ట్ చేస్తారా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.