జనసేన కూటమి పేరుతో టీడీపీ, బిజెపి తో పొత్తు పెట్టుకోని ఎలక్షన్స్ కు వెళ్ళింది. ఈ పొత్తులో భాగంగా మొత్తం 21 సీట్లలో పోటి కి సిద్ధం అయింది. దీనిని తన అనుకూలంగా మార్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ తెలివితేటలతో జన సేన పార్టీ నీ భూస్థాపితం చేసే విధంగా సీట్లను కేటాయించారు.
పొత్తులో భాగంగా జనసేనకు 52 సీట్లు వున్న రాయలసీమ లో కేవలం 2 సీట్లు మాత్రమే కేటాయించారు. అందులో కర్నూలు జిల్లాలో 14 సీట్లలో ఒక సీట్ లో కూడా పోటి చెయ్యడం లేదు. ఆలాగే అనంతపురం జిల్లాలో 12 సీట్లకు ఒక సీటు లో కూడా పోటి చెయ్యడం లేదు. చిత్తూరు లో 14 సీట్లకు గాను ఒక సీటు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 10 సీట్లను గాను ఒక సీటు లో పోటి చేస్తుంది. ఇక నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం కలిపి 41 సీట్లకు గాను పోటి చేస్తుంది 2 సీట్లకు మాత్రమే.ఇక కృష్ణా, గుంటూరు కలిపి 33 సీట్లకు గాను పోటి చేస్తుంది కేవలం 2 సీట్లలో మాత్రమే. మొత్తంగా గ్రేటర్ రాయలసీమ, కృష్ణ, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం కలిపి మొత్తం 126 సీట్లకుగాను జన సేన పోటి చేస్తుంది కేవలం 6 సీట్లలో మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే పది జిల్లాల్లో పోటిలో లేనట్లే.
ఇక తనకు బలం అని చెప్పుకునే గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలు కలిపి 49 సీట్లకు గాను కేవలం 15 సీట్లలో మాత్రమే పోటి చేస్తుంది. ఎక్కడ అయితే తన సామాజిక బలం అన్నాడో అక్కడకూడా సగం సీట్లలో కాదుకదా ముప్పావు వంతు సీట్లలో కూడా పోటీ చెయ్యడం లేదు. ఇదే చంద్రబాబు నాయుడి చాణిక్యం. చంద్రబాబు నాయుడు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ను కేవలం రెండు గోదావరి జిల్లాలకే పరిమితం చేసి రాజకీయంగా చావు దెబ్బ తీసాడు.
ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలి అంటే ప్రజా క్షేత్రంలో నిలబడాలి అప్పుడే కార్యకర్తలు, నాయకులు పార్టీకి అండగా వుంటారు. అలా కాకుండా పార్టీ ఎలక్షన్స్ లో పోటి లేకుండా వుంటే కార్యకర్తలు మిగలరు పార్టీ బతకదు. ఇప్పుడు చంద్రబాబు జన సేన విషయంలో ఇదే అమలు చేశారు. పవన్ కళ్యాణ్ 2014 ఎలక్షన్ లో పోటి కి దూరంగా వున్నారు, 2018 లో కూడా ఇంచు మించు 135 సీట్లలో పోటి చేశారు . ఇప్పుడు 2024 కి వచ్చేసరికి 21 సీట్లలో అది కేవలం రెండు, మూడు జిల్లాలకు పరిమితం అయ్యారు. అంటే మూడు ఎలక్షన్స్ చేసిన పార్టీ రాష్ట్రం అంతటా వ్యాపించి వుండకుండా కేవలం మూడు జిల్లాలకే పరిమితం చేసేలా చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ తెలివితేటలు చూపారు. ఇక జన సేన అనేది రాబోయే రోజుల్లో అ రెండూ గోదావరి జిల్లాలకే పరిమితం అవుతుంది.
ఇక ఇప్పుడు జన సేన పోటి చేసే 21 సీట్లలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా సపోర్ట్ చేస్తారో చూడాలి. కనీసం పవన్ కళ్యాణ్ ను కూడా గెలవనియ్యకుండ చేసి జన సేన ను రాజకీయంగా చావు దెబ్బ తీస్తాడు.