సామాజిక సంక్షేమం, సామాజిక న్యాయంకు పాతరేసిన టీడీపీ వాటిని పట్టించుకోకుండా తన కూటమి పార్టీలు అయిన బిజెపి, జన సేనతో జతకట్టి విజయవాడలోని మూడు నియోజకవర్గాలు అయిన సెంట్రల్, పశ్చిమ, తూర్పు తో పాటు విజయవాడకి అనుకోని వున్న గన్నవరం, మైలవరం, పెనమలూరు, మంగళగిరి నియోజకవర్గాలు కలిపి మొత్తం ఏడు నియోజకవర్గాలకు కలిపి ఆరు స్థానాలకు తన సొంత సామాజిక వర్గం నేతలకే టికెట్ కేటాయించారు. అలాగే మిగిలిన ఏకైక టికెట్ ను మరో ఓసి కాపు కులానికి చెందిన వారికి ఇచ్చారు. చంద్ర బాబును , జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్న పేద సామాజిక వర్గాలు అయిన బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వకుండా నమ్మించి గొంతు కోశారు.
ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరుపున విజయవాడ పశ్చిమం నుండి ముస్లీం అభ్యర్థి అయిన ఆసీఫ్ కు అవకాశం ఇచ్చారు,విజయవాడ తూర్పు నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాశ్ కు విజయవాడ సెంట్రల్ నుండి ఆర్యవైశ్య వర్గంకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు, పెనమలూరు నుండి బీసీ గౌడ సామాజిక వర్గానికీ చెందిన జోగి రమేష్ కు , మైలవరం నుండి బీసీ యాదవ్ సామజిక వర్గానికి చెందిన తిరుపతిరావుకు, గన్నవరం నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వంశీకి , ఇక అత్యంత కీలకమైన మంగళగిరిలో మరో బీసీ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు వైసీపీ నుండి వైఎస్ జగన్ తన పార్టీ తరుపున టికెట్ లు కేటాయించి పోటీకి రంగంలోకి దింపారు. మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను 3 సీట్లు బీసీ వర్గాలు అయిన యాదవ్, గౌడ, పద్మశాలిలకు , ఒకటి మైనారిటీలకు, మరొకటి ఓసి ఆర్యవైశ్య వర్గానికీ, రెండు సీట్లు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చి సామజిక న్యాయం అన్ని వర్గాలకు అందేలా రాజ్యాధికారం వుండేలా ఎమ్మెల్యే గా పోటి చేసే అవకాశం కల్పించి మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు వైఎస్ జగన్.
చంద్ర బాబు మాత్రం సామాజిక న్యాయం లేకుండా మిగతా వర్గాల వారిని మోసం చేస్తూ పక్కన పెట్టేసాడు. విజయవాడ పశ్చిమ సీటు ముస్లీం సామజిక వర్గానికి ఇస్తా అని చివరకు బాబు తన సన్నిహితుడు అయిన సుజనా చౌదరి కి టికెట్ కేటాయించారు. గన్నవరం యాదవ సామాజిక వర్గానికి ఇస్తా అని చివరకు వెంకట్రావు చౌదరికి టికెట్ కేటాయించారు. విజయవాడ లో బలమైన సామాజిక వర్గాలు అయిన బీసీల్లో నగరాలకు , గౌడ, మైనార్టీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు చంద్రబాబు నాయుడు. మైలవరంలో బీసీ యాదవ్ పై డబ్బున్న తన సొంత సామాజిక పెత్తందారుడ్ని, విజయవాడ పశ్చిమలో మైనారిటీ అభ్యర్థి మీద వేల కోట్ల అధిపతి అయిన సుజనా చౌదరిని పోటీలోకి దింపారు చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు ప్రతిసారి బీసీ లను , మైనారిటీలను ఓట్ల కోసం మాత్రమే వాడుకొంటూ వెన్నుపోటు పొడుస్తున్నాడు, ఈసారి బీసీ లు, మైనారిటీ లు టీడీపీ కూటమికి సపోర్ట్ చెయ్యవద్దు అని ఆయా సామాజిక వర్గాలు తీర్మానాలు చేసుకోని బాబు కూటమికి ఓట్లు వేయవద్దు అని ప్రచారం చేస్తుండడం విశేషం.