టిడిపి పార్టీలో పని చేసే వారికి సీట్లు దక్కవు అని మరోసారి రుజువు చేసిన టీడీపీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు. ఈక్రమంలో ఆయన రాజకీయానికి బలైన వారెందరో, ఇప్పుడు ఎంఎస్ రాజు, మహాసేన రాజేష్ ల వంతు అయింది. టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయిన ఎంఎస్ రాజుకి మొదట శింగనమల టికెట్ ఇస్తాం అని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. డబ్బు పెద్దగా ఖర్చు చేయకపోయిన రాష్ట్రం మొత్తం కాళ్ళు అరిగేలా తిప్పించారు. చివరికి శింగనమల టికెట్ ను గత ఎన్నికలో ఓడిపోయిన బండారు శ్రావణికి కేటాయించి రాజు కి వెన్నుపోటు పొడిచి, శింగనమల టికెట్ ఇవ్వలేకపోయం బాపట్ల ఎంపీ సీట్ ఇస్తాం అని హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి, మార్చి నెల మధ్య వరకు ఎంఎస్ రాజు పేరుతో బాపట్ల పార్లమెంట్ పరిధిలో IVRS చేపించారు. తన ఆస్థాన పత్రికలు అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సీట్ కన్ఫర్మ్ అన్నట్లు పేర్లు కూడా రాపించారు. కానీ చివరికి తెలంగాణ బీజేపీకి చెందిన ఒక నాయకుడికి టీడీపీ తరుపున టికెట్ ఇచ్చి, ఎంఎస్ రాజుకి వెన్నుపోటు పొడిచారు.ఈ విషయంపై మాట్లాడానికి ఎంఎస్ రాజు ప్రయత్నించగా చంద్రబాబు నిరాకరించాడు.టికెట్ ఎందుకు ఇవ్వలేదో చర్చించడానికి చంద్రబాబు ఇంటికి మందకృష్ణ మాదిగ, వర్ల రామయ్య వెళ్లారు, వాళ్ళకి చంద్రబాబు నుంచి సరైన సమాధానం దొరకలేదు.
మహాసేన రాజేష్ కి టీడీపీ మొదటి జాబితాలో పి.గన్నవరం సీట్ ను కేటాయించారు. గతంలో రాజేష్ హిందువులు పైన తీవ్ర పరుషజాలం వాడటంతో సీట్ ప్రకటించిన అనంతరం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. యూట్యూబ్ లో వీడియోలు చేసుకునే రాజేష్ కు ఎమ్మెల్యే సీటు ఏంటి అని రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయింది. అంత వ్యతిరేకత ఉన్న మొదటలో సీట్ అలానే ఉంచారు, వ్యతిరేకత సర్వసాధారణం అని తర్వాత అన్ని సర్దుకుంటాయి అని మొదట భావించారు, అదేవిధంగా వ్యతిరేకత సద్దుమణిగాక ఎటువంటి సమాచారం లేకుండా ఆ సీట్ ను జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించారు. సీట్ వారికి కేటాయిస్తున్నట్లు రాజేష్ కు అసలు సమాచారం అందించలేదు. ఆస్థాన మీడియాలో తరుచూ డిబేట్ లో కనిపించే రాజేష్ కు, టికెట్ నిరాకరించిన తర్వాత రాజేష్ వారితో మాట్లాడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మీడియా వారు స్పందించడం లేదు అంటా.. అలా ఉంటుంది చంద్రబాబు వాడకం