2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున తిరుపతి అసెంబ్లీ నుంచి జనసేన పార్టీకి చెందిన ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నాడు. ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూర్ అసెంబ్లీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీట్ నిరాకరించడంతో వెళ్లి జనసేన పార్టీలో చేరాడు. గతంలో శ్రీనివాసులు పైన పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేశాడు. గతం గతః అన్నట్లు పవన్ కళ్యాణ్ శ్రీనివాసులు పై తీవ్ర వ్యాఖ్యలు చేసినా, తిరుపతి అసెంబ్లీ టికెట్ కేటాయించాడు. అందుకు ప్రధాన కారణం కాపు ఓటర్లు తిరుపతి నియోజకవర్గంలో అధికంగా ఉండడమే.
అభ్యర్థిత్వ హామీ తీసుకొని తిరుపతికి వెళ్లిన శ్రీనివాసులు మొదట జనసేన నేతల నుంచి స్పందన కరువైంది. అప్పటికే ఇన్చార్జిగా ఉన్న కిరణ్ రాయల వర్గం లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ తిరుపతి అంత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. ఒక సందర్భంలో మాజీ ఎమ్మెల్యే టిడిపికి చెందిన సుగుణమ్మ జనసేన పార్టీలో చేరి కూటమి తరుపున పోటీ చేయాలని అనుకుంది కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరణి శ్రీనివాసులు వైపు మొగ్గు చూపాడు. ఇటీవల తిరుపతి పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అరుణ్ శ్రీనివాసులకి సహకరించవలసిందిగా జనసేన తిరుపతి అధ్యక్షుడు కిరణ్ రాయల్ కు కూటమి నేతలకి సూచించారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చెప్పిన కూడా కూటమి నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పవన్ కళ్యాణ్ మాట కూడా వినక పోయేసరికి శ్రీనివాసులకి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితికి వెళ్లిపోయాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.