2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున తిరుపతి అసెంబ్లీ నుంచి జనసేన పార్టీకి చెందిన ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నాడు. ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూర్ అసెంబ్లీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీట్ నిరాకరించడంతో వెళ్లి జనసేన పార్టీలో చేరాడు. గతంలో శ్రీనివాసులు పైన పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేశాడు. గతం గతః అన్నట్లు పవన్ కళ్యాణ్ […]
తిరుపతి టికెట్ విషయంలో జనసేన నేతలను ఒప్పించడం పవన్ కళ్యాణ్కు తలనొప్పిగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆరణి శ్రీనివాసులుకు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వాలన్న డిమాండ్ను మరోసారి జనసైనికులు పవన్ ముందు పెట్టారు. ఆరణి ఒత్తిడితో పవన్ శుక్రవారం హడావుడిగా తిరుపతికి వెళ్లారు. సేనకు చెందిన కిరణ్ రాయల్, హరిప్రసాద్, రాజారెడ్డి, కీర్తన, సుభాషిణి, హేమకుమార్, కిశోర్, మనోజ్, టీడీపీకి చెందిన నరసింహ యాదవ్, ఊకా విజయ్కుమార్, జేబీ శ్రీనివాస్, పెద్దప్ప తదితరులతో వేర్వేరుగా భేటీ […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులు ప్రకటన తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన తర్వాత అది తార స్థాయికి చేరింది. కూటమిలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం అని సంకేతాలు వాల్లే పంపుతున్నారు. కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి మొదట భాను ప్రకాష్, కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి రత్న ప్రభకి టికెట్ […]
తిరుపతి అసెంబ్లీ సీటు విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పటడుగులు వేస్తున్నారని అటు జనసైనికులు.. ఇటు తెలుగుదేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. స్థానికేతరుడైన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు అవకాశమిస్తే సహించేది లేదని తిరగబడ్డారు. ఏకంగా సమావేశం పెట్టి మరీ ఆయన్ను పెట్టొద్దని డిమాండ్ చేశారు. తిరుపతికి దేశ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యం ఉంది. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న ప్రాంతం. ఇక్కడ పట్టు కోసం నిత్యం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేత భూమన […]