2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వం పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా, మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జితో మొదలు పెట్టారు, కొనసాగింపుగా తాత్కాలిక సచివాలయం దాకా వచ్చింది.ఫ్లోటింగ్ బ్రిడ్జి ట్రయిల్ రన్ నిర్వహిస్తున్న సమయంలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయినట్లుగా వార్తలను ప్రచురించింది ఎల్లో మీడియా. ఆ సాయంత్రమే నిర్వాహకులు ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇంకా ప్రజల సందర్శనార్థం ప్రారంభించలేదు, కమిషనర్ ఆదేశాల మేరకు అలలు ఎక్కువగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నామని వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా మరుసటి రోజు పెద్ద అక్షరాలతో వార్తను ప్రచురించారు. వివరణ వెంటనే ఇచ్చినా కూడా ఆరోజు పత్రికలో అది రాయకుండా మరుసటి రోజు పత్రికలో ఒక చిన్న వార్తగా రాసి వదిలేశారు.
నిన్న తాత్కాలిక సచివాలయం తాకట్టుపై ఇలాంటి వార్తలే రాశారు. 370 కోట్లకు తాత్కాలిక సచివాలయం HDFC బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టారంటూ వరుస కథనాలతో గగ్గోలు పెట్టారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చినా కూడా ఎల్లో మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి HDFC బ్యాంక్ ప్రతినిధులు తాత్కాలిక సచివాలయం తాకట్టును ఖండించారు. ఈ వార్త ప్రజలని తప్పుదోవ పట్టించడానికి రాశారని వార్తకు తాకట్టుకు ఎటువంటి సంబంధం లేదని HDFC ప్రతినిధి మీడియాతో వెల్లడించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి ఎల్లో మీడియా ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన బురద జల్లడానికి ఎంతటికైనా దిగుజారుతుంది అనేదానికి ఇలాంటి వార్తలు నిదర్శనం. వార్త పత్రికలో వచ్చిన వార్తలని టిడిపి జనసేన సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం ,ఆ వార్తలు పైన టిడిపి జనసేన నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టడం అదే నిజం అని ప్రజల్ని నమ్మించడం. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి విశ్వ ప్రయత్నాలు టిడిపి చేస్తుంది.
ఇలాంటి వార్తలతో టిడిపి గ్లోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టని మరోసారి నిరూపించుకుంది. బహుశా రేపు రాజధాని తాకట్టు hdfc బ్యాంకులో కాదు మరో బ్యాంకులో అని ఇంకో దుష్ప్రచారం చేయగల సమర్థులు ఈ ఎల్లో మూక . ఎలక్షన్స్ అయ్యేలోపు ఇలాంటి అబద్ధపు వార్తలు ఇంకెన్ని రాస్తారో