ఎల్లో గ్యాంగ్ గ్రామ, వార్డు వలంటీర్లపై కక్ష కట్టాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ వారితో తిరుగుతున్నారంటూ ఫొటోలు తీసి వేధిస్తున్నాయి. దీనికితోడు వారిని ప్రజాసేవ చేయనీయకుండా అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వారి ద్వారా పింఛన్లు పంపిణీ జరగకుండా ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చినట్లు ఉత్తర్వులు ఇప్పించినట్లు విమర్శలున్నాయి. దీనంతటికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా సైన్యం రాజీనామాలకు దిగింది. గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారిని నారా మాటలు అన్నారు. ఈ సమయంలో తీవ్రంగా నిరసన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పచ్చ మనుషులు మరిన్ని కుట్రలు చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అయితే నిత్యం ఏడుస్తున్నాయి. దీనిని సహించకలేక సేవా సైన్యం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబంధిత అధికారులకు పత్రాలను అందిస్తోంది.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో 35 మంది, కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పంచాయతీకి చెందిన 62 మంది, ఆత్మకూరులో 75 మంది, కొడవలూరు మండలంలో 49 మంది, వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. లిఖితపూర్వకంగా వాటిని సచివాలయాల అడ్మిన్లకు అందజేశారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చేజర్ల మండలం, బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాల్లో రాజీనామాలు చేసేశారు. తిరువూరు మండలం రోలుపడి గ్రామానికి చెందిన 18 వలంటీర్లు రాజీనామా లేఖలను ఎంపీడీఓకు అందజేశారు. మచిలీపట్నంలో ఏకంగా వెయ్యికి మందికి పైగా విధుల నుంచి తప్పుకొన్నారు. తాడిపత్రిలోనే ఇదే పరిస్థితి నెలకొంది. వారంతా చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంది. టీడీపీ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది.